ఆంధ్రప్రదేశ్‌

హజ్ యాత్రికులు 31లోపు కిస్తీ చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: ఈ ఏడాది హజ్ యాత్రకు ఎంపికైన ప్రతి హజ్ యాత్రికుడు మొదటి విడత రూ.81,000 రూపాయలు జనవరి 31లోపు సెంట్రల్ హజ్ కమిటీకి చెల్లించాలి. చలానా ఫారాన్ని హజ్ కమిటీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని బ్యాంకులో జమ చేయాలని హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహ్మద్ లియాఖత్ అలీ తెలిపారు. బ్యాంక్ ఒరిజనల్ చలానా (ఒరిజినల్ పే ఇన్ స్లిప్), ఒరిజనల్ పాస్‌పోర్ట్, వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ ఫొటో, మెడికల్ ఫిట్‌నెస్, స్క్రీనింగ్ సర్ట్ఫికెట్‌లను విజయవాడలోని ఏపీ స్టేట్ హజ్ కమిటీ వద్ద జమచేయాలని తెలిపారు. బ్రోకర్లు హజ్ యాత్రికుల్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే వారి మాటలు నమ్మవద్దని తెలిపారు. మెడికల్ సర్ట్ఫికెట్‌లు, సర్వీస్ ఛార్జీలంటూ 81,000 రూపాయల కంటే ఎక్కువ వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలన్నారు.
చేశారు.