ఆంధ్రప్రదేశ్‌

జ్వరం మాత్ర గొంతులో ఇరుక్కుని మూడేళ్ల బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ, ఫిబ్రవరి 15: గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం కందిపాడు గ్రామంలో జ్వరం మాత్ర గొంతులో ఇరుక్కుని మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుమళ్ల పైడిరాజు, మారమ్మల పెద్ద కుమారుడు సారరాజు గత రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. గురువారం ఉదయం వైద్యులు ఇచ్చిన మాత్రను మింగించే క్రమంలో జ్వరం మాత్ర సారరాజు నోట్లో వేయగా గొంతులో ఇరుక్కున్నట్లు తెలిపారు. నోట్లో నీరు పోసినా ఎంతసేపటికీ మాత్ర కిందకు జారిపోకపోవడంతో బాలుడు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే బెల్లంకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీంతో తల్లి మారెమ్మ గుండెలవిసేలా విలపించింది. పైడిరాజు, మారెమ్మలకు ఇద్దరు మగ సంతానం కాగా, అందులో పెద్ద కుమారుడు సారరాజు.