ఆంధ్రప్రదేశ్‌

రాజ్యసభ సీటు.. వెరీ హాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రానున్న రాజ్యసభ ఎన్నికలకు టీడీపీలో ఇప్పటి నుంచే వేడి మొదలయింది. సాంకేతికంగా పార్టీకి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే, మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు త్వరలో టీడీపీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మూడోసీటు కూడా టీడీపీ ఖాతాలో కలవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో రాజ్యసభ సీట్ల కోసం కోసం భారీ స్థాయిలోనే పోటీ నెలకొంది. ఈనెలాఖరుకు రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి నెలాఖరున ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాష్ట్రం నుంచి ఎన్నికయ్యే ముగ్గురు సభ్యుల్లో ఇద్దరిని టీడీపీ సులభంగా పంపవచ్చు. టీడీపీకి సంఖ్యాపరంగా వచ్చే రెండు స్థానాలు ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. గత 14 ఏళ్ల నుంచి టీడీఎల్పీని సమన్వయం చేస్తున్న కోనేరు సురేష్, జూపూడి ప్రభాకర్, ప్రతిభాభారతి వంటి నేతలు రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఆర్థికమంత్రి, తొలి తరం సీనియర్ నేత, బీసీ వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు, మాదిగ వర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, కమ్మ వర్గానికి చెందిన మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, రెడ్డి వర్గానికి చెందిన కర్నూలు జిల్లా నేత కొండారెడ్డి రవీంద్రరెడ్డి పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి, యాదవ నేత, యనమల చాలాకాలం నుంచీ ఢిల్లీకి వెళ్లాలని ఆశిస్తున్నారు. సీనియర్లను ఢిల్లీకి పంపించి, రాష్ట్రంలో రెండోతరం నేతలకు అవకాశం ఇవ్వాలని ఆయన గత 15 ఏళ్ల నుంచీ వాదిస్తున్నారు. గతంలో సీఎం రమేష్‌కు రాజ్యసభ ప్రకటించే సందర్భంలో యనమల పేరు దాదాపు ఖరారయినా, ఎన్నికల్లో పార్టీకి చేసిన ఆర్థిక సేవలను దృష్టిలో ఉంచుకున్న నాయకత్వం రమేష్ వైపే మొగ్గు చూపింది. మళ్లీ ఒకసారి గరికపాటి మోహన్‌రావు, మరోసారి టీజీ వెంకటేష్‌కు అవకాశం దక్కింది. ఈసారైనా యనమలను అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి. అయితే ఆయన రాజ్యసభకు వెళితే, ప్రభుత్వంలో అనుభవజ్ఞుడిని దూరం చేసుకోవాల్సి వస్తుందన్న భావనతోపాటు, బాబుకు మంచి, చెడు నిర్మొహమాటంగా చెప్పే వారు కూడా లేకుండా పోతారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ‘బాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కలెక్టర్లు, జేసీలు, కమిషనర్లుగా చేసిన వారంతా ఇప్పుడు ముఖ్య కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి స్ధాయిలో ఉన్నారు. అదేవిధంగా అప్పుడు ఎస్పీ, డీసీపీలుగా ఉన్న ఐపీఎస్‌లు ఇప్పుడు డీజీపీ, అదనపు డీజీపీల స్థాయిలో పనిచేస్తున్నారు. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్లలో అప్పుడు మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులే ఎక్కువ మంది ఉన్నారు. ఒకరకంగా బాబు పెద్దవాడయి, మిగిలిన వాళ్లు చిన్నవాళ్లుగా కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే బాబుకు అన్నీ తెలుసుకాబట్టి తాము చెప్పనవసరం లేదని నేతలు- అధికారులు, వీరు తనకేమైనా చెబుతారేమోననుకుని బాబు భావిస్తుండటంతో అసలు వాస్తవాలు బాబు దృష్టికి వెళ్లడం లేదు. అందువల్ల కనీసం వాస్తవాలు చెప్పే యనమల లాంటి వాళ్లు కూడా లేకపోతే పరిస్థితి మరీ కష్టంగా ఉంటుంద’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఇక గత 14 ఏళ్ల నుంచి నాడు అధికారంలో ఉన్న వైఎస్, కాంగ్రెస్, జగన్‌పై ఎదురుదాడి చేస్తున్న వర్ల రామయ్య పేరు కూడా వినిపిస్తోంది. దళిత తేజం-తెలుగుదేశం కార్యక్రమాలను ఆయనే సమన్వయం చేస్తున్నారు. గతంలో చివరి నిమిషంలో తిరుపతి ఎంపీ సీటు, మరోసారి అదేవిధంగా పామర్రు నుంచి పోటీ చేయించిన నాయకత్వం, వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరటంతో ఆయనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతోందన్న విమర్శల నేపధ్యంలో, ఆయనకు ఎంపీ సీటు ఇవ్వడం ద్వారా ఆ నిందకు తెరదించే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇక ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్ల వరకూ ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కంభంపాటి కూడా సీటు ఆశిస్తున్నారు. ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడే రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఫైళ్లు బాగా కదిలాయని, ఆవిధంగా లాబీ చేయడం వల్లే సాధ్యమైందని చెబుతున్నారు. అయితే వర్ల రామయ్య, కంభంపాటి ఇద్దరూ కృష్ణా జిల్లాకు చెందిన వారే కావడంతో, ఇద్దరిలో ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ కనిపిస్తోంది. ఈసారి రాయలసీమ రెడ్డి వర్గానికి ఒక సీటు ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. నాయకత్వం కూడా వైసీపీని సంప్రదాయంగా అభిమానించే రెడ్డి వర్గానికి సీటు ఇవ్వడం ద్వారా, జగన్‌కు చెక్ పెట్టవచ్చన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దానికితోడు శనివారం .. వైసీపీ తన అభ్యర్థిగా ప్రభాకర్‌రెడ్డిని తాజాగా ప్రకటించినందున, సీమ నుంచి అదే వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలన్న యోచన ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, మూడవ సీటుకు ఆ వర్గం నేతను పోటీకి దించాలని భావిస్తోందంటున్నారు. అదే జరిగితే ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో కీలకపాత్ర పోషించిన కర్నూలు జిల్లా నేత, కొండారెడ్డి రవీంద్రరెడ్డి పేరు ఖరారు కావచ్చంటున్నారు. సీమ నేతలు కూడా ఈసారి రెడ్డి వర్గానికే సీటు ఇవ్వాలని పట్టుపడుతున్నందున, రవీంద్రరెడ్డికి అవకాశాలు మెరుగుగా ఉంటాయంటున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే గుంటూరు జిల్లాతోపాటు, ఉత్తరాంధ్రకు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానితో టీడీపీ మూడవ సీటుకు కావలసిన ఒక్క ఓటు సరిపోతుంది. ప్రస్తుతం టీడీపీకి 131, వైసీపీకి 44 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. కాగా రిటైరు కానున్న సీఎం రమేష్‌కు ఇప్పటి పరిస్థితి ప్రకారం రెండోసారి పొడిగించే అవకాశాలు కష్టమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.