ఆంధ్రప్రదేశ్‌

అశ్రునయనాలతో పగడాలకు వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాచర్ల, ఫిబ్రవరి 19: సాధారణ రైతు కుటుంబంలో జన్మించి గిద్దలూరు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన పగడాల రామయ్య (72) సోమవారం తెల్లవారుజామున 2.30గంటల సమయంలో కన్నుమూశారు. రామయ్య మృతదేహానికి మండలంలోని చినగానిపల్లి గ్రామంలో భారీ అనుచర బంధుమిత్రుల మధ్య సోమవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. రైతు కుటుంబంలో జన్మించిన పగడాల రామయ్య 1982లో సింగిల్‌విండో అధ్యక్షులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1989 నుంచి 2004వరకు జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులుగా 12 ఏళ్ళపాటు పదవి నిర్వహించారు. అనంతరం 2004లో గిద్దలూరు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఐదేళ్లపాటు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి అందరివాడుగా గుర్తింపు పొందారు. రామయ్యకు భార్య, నలుగురు సంతానం ఉన్నారు.