ఆంధ్రప్రదేశ్‌

గురుకులాల్లో ప్రవేశాలకు ఇక ఉమ్మడి ప్రవేశ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాలయాలు, ఏపీ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి ఇకపై ఉమ్మడిగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 8న ఉమ్మడి పరీక్ష నిర్వహించి, ఆయా విద్యాలయాల్లో సీట్లు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ మంత్రి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతవరకూ సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ, ఏపీ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి ఇంగ్లీష్ మాథ్యమంలో ప్రవేశాలకు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేవారని మంత్రి తెలిపారు. ఆయా విద్యా సంస్థల్లో చేరదలిచే విద్యార్థులు నాలుగు ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేవారన్నారు. దీనివల్ల వారు ఎన్నో ఇబ్బందులు పాలయ్యేవారన్నారు. విద్యార్థుల అవస్థలను గుర్తించిన సీఎం చంద్రబాబునాయుడు అన్నింటికీ కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలని ఆదేశించారన్నారు. సీఎం ఆదేశాల మేరకు 2018-19 నుంచి ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించనున్నామని తెలిపారు.
ఈ మేరకు ఏప్రిల్ 8న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్షను నిర్వహించనున్నామన్నారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని, ఆ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా విద్యా సంస్థల్లో సీట్లు భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు. 4వ తరగతిలోని ఇంగ్లీష్, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ పాఠ్యాంశాల నుంచి 10 ప్రశ్నల చొప్పున మల్టిపుల్ ఛాయిస్‌లో ప్రశ్నపత్రం ఉంటుంది. విద్యార్థులు 1.9.2018 నాటికి 10 నుంచి 13ఏళ్ల మధ్య ఉండాలని మంత్రి తెలిపారు. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఈ ఉమ్మడి పరీక్ష జరగనుందన్నారు. మొత్తం 24,820 సీట్లకు లక్ష వరకూ దరఖాస్తులు రావొచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు.