ఆంధ్రప్రదేశ్‌

ఎపి అసెంబ్లీ రెండోసారి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసుపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని వైకాపా ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో ఎపి అసెంబ్లీ సమావేశం సోమవారం రెండుసార్లు వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని వైకాపా సభ్యులు కోరగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు అందుకు అంగీకరించలేదు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ తర్వాత అగ్రిగోల్డ్ కేసుపై చర్చిద్దామంటూ స్పీకర్ చేసిన సూచనను వైకపా ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా పోడియం వద్దకు చేరి నినాదాలు ప్రారంభించారు. దీంతో స్పీకర్ తొలుత 5 నిమిషాల సేపు, ఆ తర్వాత 10 నిమిషాల సేపు సభను వాయిదా వేశారు. అయినప్పటికీ వైకాపా సభ్యులు తమ పట్టువీడలేదు.