ఆంధ్రప్రదేశ్‌

మహాగణపతి నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (గాజువాక), సెప్టెంబర్ 28: మూడు వారాలుగా భక్తుల పూజలందుకున్న 78 అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిర్వాహకులు బుధవారం రాత్రి నిమజ్జనం చేశారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో విశ్వా అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి పురస్కరించుకుని 78 అడుగుల భారీ గణపతిని ప్రతిష్ఠించిన విషయం విదితమే. గాజువాక లంకావారి మైదానంలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం 21 రోజులు పాటు భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం వేలాది మంది భక్తుల సమక్షంలో అగ్నిమాపక శకటాల సహాయంతో వేదిక వద్దే నీరు చిమ్ముతూ నిమజ్ఞనం చేశారు. నిమజ్ఞనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. మూడు గంటల్లో గణపతి నిమజ్జనాన్ని పూర్తి చేశారు. గాజువాక ప్రాంతానికి చెందిన ప్రజలు చూసేందుకు వీలుగా భారీ ఎల్‌ఇడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు.