ఆంధ్రప్రదేశ్‌

ఎఎస్పీ ఆత్మహత్య లేఖ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ‘నా మరణానికి ఏ అధికారి, ఎవరూ బాధ్యులు కారు.. మూడు నెలలుగా విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నా..’- అని రాసిన సూసైడ్ నోట్‌ను సిబిసిఐడి పోలీసులు పాడేరు ఎఎస్పీ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్నారు. ఎఎస్పీ శశికుమార్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు ప్రారంభించిన సిఐడి పోలీసులు శుక్రవారం ఆయన కార్యాలయంలో క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఆత్మహత్య లేఖను, రివాల్వర్‌ను, ఇతర సామగ్రిని వారు స్వాధీనం చేసుకున్నారు. నుదిటిపై బుల్లెట్ గాయంతో ఎఎస్పీ మరణించడంతో ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్‌ను పరిశీలించాక ఎఎస్పీ ఆత్మహత్యకు పాల్పడ్డారని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.