జాతీయ వార్తలు

పౌరసత్వ బిల్లుపై పెల్లుబికిన ఆందోళనలు :విమాన సర్వీసుల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు పెల్లుబికాయి. అస్సాం రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో దిబ్రూఘడ్, గౌహతి విమాన సర్వీసులను గురు, శుక్రవారాల్లో రద్దు చేస్తున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. ఇండిగోతోపాటు స్పైస్ జెట్, విస్తారా, గో ఎయిర్ విమాన సర్వీసులను కూడా రద్దు చేశామని ఆయా సంస్థల ప్రతినిధులు చెప్పారు.అస్సాంలో అల్లర్ల దృష్ట్యా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దిబ్రూఘడ్ మధ్య అన్ని విమానసర్వీసులను రద్దు చేశామని విమానాశ్రయ అధికారులు చెప్పారు.