ఆటాపోటీ

రియోలో భారత్ ఫ్లాప్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత బృందం అట్టహాసంగా రియో డి జెనీరోకు బయలుదేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 118 మంది రియో వెళ్లారు. ఒలింపిక్స్‌కు ముందే డోపింగ్ సమస్య భారత క్రీడా రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. బీజింగ్‌లో కాంస్యం, లండన్‌లో రజత పతకాలను గెల్చుకున్న సుశీల్ కుమార్‌ను పక్కకునెట్టేసి, రియోలో పోటీపడే అవకాశాన్ని చేజిక్కించుకున్న నర్సింగ్ పంచమ్ యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలం కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కోర్టుకెక్కి, భారత జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) అనుమతి పొంది నర్సింగ్ రియోకు వెళ్లాడు. కానీ, భారత డోపింగ్ నిరోధక విభాగం (నాడా) అతనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. నర్సింగ్ కేసును విచారించిన తర్వాత కోర్టు అతనిపై నాలుగేళ్ల సస్పెన్షన్ వేటు విధించింది. ఫలితంగా రియోలో అతను పోటీ అవకాశాన్ని కోల్పోయాడు. మొత్తం మీద భారత ఒలింపిక్స్ చరిత్రలోనే మొదటిసారి వందకుపైగా అథ్లెట్లు పోటీలో దిగడంతో, అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. కనీసం పాతిక పతకాలు లభిస్తాయని వివిధ క్రీడా సంఘాల అధికారులు జోస్యం చెప్పారు. ఎనిమిదికి తక్కువ కాకుండా పతకాలు దక్కుతాయని వివిధ సర్వే నివేదికలు స్పష్టం చేశాయి. షూటింగ్, బాడ్మింటన్, టెన్నిస్ విభాగాల్లో పతకాల పంట పండుతుందని అంతా ఆశించారు. హాకీలో పతకం లభించే అవకాశం ఉందని క్రీడా పండితులు అంచనా వేశారు. మిగతా విభాగాల్లో ఒకటో రెండో పతకాలు దక్కకపోతాయా అనుకున్నారు. కానీ, ఒకదాని తర్వాత మరొకటిగా ఒక్కో విభాగంలోనూ చేదు అనుభవమే ఎదురైంది. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అవసరమైన కనీస అర్హతను మాత్రమే అందుకోగలిగిన చాలా మంది క్రీడాకారులు అసలు సిసలైన పోటీలో నిలవలేక చేతులెత్తేశారు. జిమ్నాస్టిక్స్‌లో దీపా కర్మాకర్ ఎంతో శ్రమించినా నాలుగో స్థానానికి పరిమితమైంది. సాక్షి మాలిక్ రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని అందుకొని, భారత్ పతకాల ఖాతాను తెరిస్తే, బాడ్మింటన్ స్టార్ పివి సింధు రజత పతకాన్ని చేర్చింది. భారీ అంచనాలతో రియోకు వెళ్లిన భారత బృందం ఇంత దారుణంగా విఫలం కావడం భారత క్రీడా రంగం పతనావస్థకు అద్దం పడుతున్నది.