ఆంధ్రప్రదేశ్‌

రెండో రోజుకు చేరిన అతిరుద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, డిసెంబర్ 21: దక్షిణ కాశీ తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామ పంచారామ శైవక్షేత్రంలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞం సోమవారం రెండో రోజుకు చేరింది. వైకుంఠ ఏకాదశి, శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఉదయం 6.30 గంటలకు రుత్విక్కులు గురువందనం, వేద పారాయణం, గురుప్రార్ధన మహన్యాసం నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ విజయేశ్వరిదేవి కరుణామయి అమ్మ నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రుద్రాభిషేకం కార్యక్రమాన్ని హోమగుండాల వద్ద రుత్విక్కులు నిర్వహించారు. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు దంపతులు హోమగుండాల వద్ద రెండో రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.