క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుర్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, మార్చి 17: దైవ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుర్లు రమీజా(42), రేష్మి(21) దుర్మరణం పాలైన సంఘటన శనివారం పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సురేంద్రరెడ్డి తెలిపిన వివరాల మేరకు విజయనగర్ కాలనీలో నివశిస్తున్న కుళ్ళాయప్ప తన భార్య రమీజా, కూతురు రేష్మిలతో కలసి ద్విచక్ర వాహనంపై కడప జిల్లాలోని మంగపట్నం దర్గాకు బయలుదేరారని, ఆర్‌టీసీ బస్టాండ్ సమీపంలోని గురు లాడ్జి వద్ద గ్రానైట్ లారీ బైక్‌ను ఢీకొట్టిందని తెలిపారు. ఈ సంఘటనలో తీవ్ర గాయాలపాలైన రమీజా, రేష్మిలను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. మెరుగైన చికిత్సకై అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తల్లీ కూతుర్లు మృతి చెందారని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు.

యువకుడి అనుమానాస్పద మృతి
కదిరి, మార్చి 17: గాండ్లపెంట మండలంలోని రెక్కమానులో జావిద్ బాషా (26) శనివారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఓ పాఠశాల ప్రాంగణంలో విద్యుత్ స్తంభం ఎక్కి లైట్ వేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై కిందపడి మృతి చెందినట్లు తెలుస్తోంది. దూదేకుల బాదుల్ల కుమారుడు మహబూబ్‌బాషా ఓ ప్రైవేటు స్కూల్‌ను నడుపుతుండగా అతని తమ్ముడు జావిద్ బాషా కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విద్యుత్ స్తంభం ఎక్కి బల్బు వేస్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. జావిద్ బాషాను కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.