క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, అక్టోబర్ 23 : మండల కేంద్రంలోని ఓ కట్టెల డిపో సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లచ్చానుపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గాదిలింగప్ప (30) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు లింగప్ప ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఇందులో భాగంగా ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని గుత్తి ఆర్‌ఎస్ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వస్తుండగా ఓ కట్టెల డిపో వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించపోయి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా, ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య మల్లేశ్వరి, కుమారుడు ధీరజ్ ఉన్నట్లు తెలిపారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుత్తి పోలీసులు తెలిపారు.

కారు బోల్తా.. యువకుడి మృతి
కొత్తచెరువు, అక్టోబర్ 23: మండల పరిధిలోని కేశాపురం గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన కారు బోల్తా సంఘటనలో ఒకరు మృతి చెందారు. కేశాపురంలో జరుగుతున్న జాతరకు బెంగళూరు నగరం నుంచి వరుణ్ (20) విచ్చేశాడు. వరుణ్ మంగళవారం కారు నడుపుతుండగా అదుపు తప్పి బోల్తాపడడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.