క్రైమ్/లీగల్

మేడపై నుంచి పడి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, మార్చి 15 : స్థానిక గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సుబ్రమణ్యం (22) గురువారం మేడపై నుంచి పడి మృతి చెందాడు. మడకశిరకు చెందిన చలపతి కుమారుడు సుబ్రమణ్యం పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటూ పట్టణ శివార్లలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి సహ విద్యార్థి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని నివాసం ఉంటున్న గదికి స్నేహితులతో కలసి వచ్చి నిద్రపోయాడు. అర్ధరాత్రి మరో స్నేహితుడు గది వద్దకు వచ్చి తనకు సంబంధించిన ద్విచక్రవాహనం తాళాలు ఇవ్వాల్సిందిగా మేడ కింద నుంచి కేకలు వేశాడు. నిద్రమత్తులో ఉన్న సుబ్రమణ్యం ఆత్రుతగా కింద స్నేహితుడిని చూడడానికి ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు మేడపై నుంచి కింద పడిపోయాడు. దీంతో గాయపడిన బాధితుడిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమాద్యంలో మృతి చెందాడు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుత్తి పోలీసులు తెలిపారు.