ఆంధ్రప్రదేశ్‌

రైల్వేజోన్ రాకుంటే లోక్‌సభలో అడుగుపెట్టను...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయకుంటే ఇక లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యే ప్రసక్తే లేదని అనకాపల్లి టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ గురువారం ప్రకటించారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుచేయాలంటూ ఇక్కడి జివిఎంసి కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద ఆయన నిరసన దీక్ష ప్రారంభించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోగా విశాఖకు రైల్వేజోన్ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వేజోన్ విషయమై కేంద్ర మంత్రులు స్పష్టమైన హామీ ఇవ్వనందుకు నిరసనగా విశాఖలో ఆందోళన తీవ్రరూపం దాల్చుతోంది.