ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగులకు ప్రజాహితమే ముఖ్యం: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎన్ని సమస్యలున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజాహితమే ప్రథమ కర్తవ్యం అని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన బుధవారం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం పనులను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి పరిపాలనా వ్యవస్థ అంతా నవ్యాంధ్ర రాజధానికి తరలిరావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఉద్యోగులంతా హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిరావాల్సిందేనని, ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవన్నారు. ఇక్కడ పనిచేయడానికి ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం తప్పక పరిష్కరిస్తుందన్నారు. సొంత రాజధానిలో అన్ని కార్యాలయాలూ అందుబాటులో ఉండాలని ప్రజలు ఆకాంక్షించడంలో తప్పులేదన్నారు. ఈనెల 27 నాటికి వీలైనన్ని కార్యాలయాలను హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలిస్తామని తెలిపారు.