ఆంధ్రప్రదేశ్‌

ఈవీఎంలపై సుప్రీంలో రివ్యూ పిటిషన్:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఈవీఎంల వ్యవహారంపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఇందుకోసం తాను రేపు ఢిల్లీ వెళుతున్నట్లు తెలిపారు. ఈవీఎంలపై తాను దేశస్థాయిలో పోరాడుతున్నట్లు తెలిపారు. తనను సంప్రదించకుండానే సీఎస్‌ను, ఇంటెలిజెన్స్ ఐజీని మార్చారని అన్నారు. తనుకు వీళ్లు భద్రత కల్పిస్తారా అని ప్రశ్నించారు. తన అడ్మినిస్ట్రేషన్‌పై సీఎస్ పెత్తనం ఏమిటి అని అన్నారు. ఈవీఎంలను రిపేర్ చేస్తామని చెప్పి టాంపరింగ్ చేశారని అన్నారు. ఎన్నిక జరుగుతుంటే సీఎస్ డీజీపీ ఆఫీసుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు ఈవీఎంలను రీప్లేస్ చేశారని అన్నారు. వీవీప్యాట్‌ల లెక్కింపునకు ఆరో రోజులు పట్టడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో బ్యాలెట్ పత్రాలు లెక్కించే పద్ధతిలో ఎంత సమయం పట్టిందో గుర్తుచేసుకోవాలని సూచించారు.