ఆంధ్రప్రదేశ్‌

నిధులకోసం కేంద్రంతో పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:విభజన చట్టం మేరకు కేంద్రంనుంచి రావలసిన నిధులకోసం రాజీలేని పోరాటం చేస్తామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగిస్తూ కేంద్రంనుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదన్నారు. నిధుల రాబట్టే విషయంలో తగిన విధంగా స్పందించడం లేదని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని, ఇది రాజకీయమని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కార్మికుడికి సొంతిల్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించిన చంద్రబాబు అసంఘటిత కార్మికులకోసం ఉద్దేశించిన బీమా పథకాన్ని ప్రారంభించారు.