రాష్ట్రీయం
కేంద్రంపై విరుచుకుపడిన చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 April 2018
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. గవర్నర్ వ్యవస్థపైన కామెంట్ చేశారు. మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ బ్యాంకులు ముంచేస్తుంటే కేంద్రం ఏమీ చేస్తుందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 25 సీట్లు సాధించి ప్రధానిని మనమే నిర్ణయిద్దాం అని అన్నారు. బ్యాంకులను దోచేసి విదేశాలకు పారిపోతుంటే కేంద్రం చూస్తుందని దుయ్యపట్టారు. మన హామీలు సాధించుకోవటమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బలంలేని బీజేపీ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతుందని విమర్శించారు. నాకేదైనా అయితే మీరంతా వలయంగా ఏర్పడాలని, రాజకీయ పరిణామాలను గమనించాలని పిలుపునిచ్చారు.