ఆంధ్రప్రదేశ్‌

సభ్యత మరచిన వైకాపా సభ్యులు: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి అసెంబ్లీ సమావేశాల్లో సిఎం చంద్రబాబు జిఎస్‌టి బిల్లును ప్రవేశపెట్టి ప్రసంగిస్తుండగా విపక్ష వైకాపా ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించారు. గురువారం శాసనసభలో వైకాపా సభ్యుల ప్రవర్తనపై సిఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కీలకమైన బిల్లుపై తాను వివరిస్తుండగా వైకాపా సభ్యులు సభ్యత మరచి నినాదాలు చేయడాన్ని చంద్రబాబు విమర్శించారు. బాధ్యత మరచిన విపక్ష సభ్యులు చట్టసభలో ఇలా దిగజారి ప్రవర్తించడం సరికాదన్నారు. రాష్ట్ర సమస్యలపై వైకాపాకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేల నిరసన మధ్య జిఎస్‌టి బిల్లును సభ ఆమోదించింది. ఆ తర్వాత కూడా విపక్షం ఆందోళన కొనసాగడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల ప్రకటించారు.