అంతర్జాతీయం

ధన మాఝీకి బహ్రెయిన్‌ రాజు నుంచి ఆర్థిక సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: భార్య మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన ఒడిశా వ్యక్తి ధన మాఝీకి బహ్రెయిన్‌ రాజు నుంచి రూ. 8.87లక్షల చెక్కు అందింది. సామాజిక కార్యకర్త అచ్యుత సమంత సహకారంతో దిల్లీ వెళ్లి మాఝీ తన చెక్కును తీసుకున్నాడు. అంబులెన్స్‌ సదుపాయం అందుబాటులో లేకపోవడం, వేరే వాహనంలో తరలించేందుకు డబ్బులు లేకపోవడంతో ధన మాఝీ తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాడు. ధన గురించి మీడియా ద్వారా తెలుసుకున్న బహ్రెయిన్‌ రాజు ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా అతడికి అండగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డబ్బును బ్యాంకులో వేసి తన ముగ్గురు కుమార్తెల చదువుకు ఉపయోగిస్తానని ధన చెప్పాడు.