మావాడితో కలసి నటిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్య 369 సీక్వెల్‌తో మనోజ్ఞ ఎంట్రీ ** వందో సినిమాకు కథలు సిద్ధం : బాలకృష్ణ
ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు నేపథ్యంలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి కథలు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఏది తన వందో చిత్రంగా చేయాలనే నిర్ణయం అమావాస్య తరువాత తీసుకుంటానని తెలిపాడు బాలకృష్ణ. క్రిష్ రూపొందించే కథలో శాతవాహనుల అంశం, అమరావతిని స్థాపించిన గౌతమీపుత్ర శాతకర్ణి పాత్ర బాగా నచ్చింది. అలాగే కృష్ణవంశీ చెప్పిన రైతు కథ కూడా బాగా నచ్చడంతో ఏ ఇతివృత్తాన్ని ఎంచుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు. దీంతోపాటు బాలకృష్ణ అప్పట్లో నటించిన ‘ఆదిత్య 369’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందే ‘ఆదిత్య 999’ సినిమాతో ఆయన తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని బాలకృష్ణ స్పష్టం చేశారు. తానుకూడా అందులో నటిస్తానని, అయితే దానికి కాస్త టైముందని ఆయన చెప్పారు. త్వరలోనే వీటికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడే అవకాశం వుంది.