ఆంధ్రప్రదేశ్‌

బీసీల సభలో ఇద్దరి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కాపులకు రిజర్వేషన్లు కల్పించి తమకు అన్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరిస్తూ బీసీ సంఘానికి చెందిన ఇద్దరు నాయకులు ఇక్కడ మంగళవారం జరిగిన బీసీల సమావేశంలో వొంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే ఉన్న ఇతర నాయకులు అడ్డుకోవడంతో వారు ప్రమాదం బారి నుంచి బయటపడ్డారు. బీసీ సంఘాల నాయకుడు, టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి ఆందోళనకారులు భారీగా పాల్గొన్నారు. కాపుల వల్ల బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తానని సిఎం చంద్రబాబు చెబుతున్న మాటలపై తమకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా బీసీల కోసం పోరాటం చేస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కృష్ణయ్య అన్నారు.