భక్తి కథలు

పుష్ట్టిమత స్థాపకుడు వల్లభాచార్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శ్రీపాద వల్లభాచార్య జయంతి సందర్భంగా...

అన్య మత మార్పిడులు అధికమై, హైందవ సనాతన సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్న విషమ పరిస్థితులు పుష్టిమత స్థాపకుడు శ్రీపాద వల్లభాచార్య అవతరణకు కారణభూతాలైనాయి. వైదిక నిష్ఠాగరిష్టుల కులంలో జన్మించి, వైష్ణవ మతాచార్యుడైన జగద్గురు మహాప్రభు శ్రీమత్ వల్లభాచార్య భారతావనిలో శుద్ధ అద్వైతాన్ని పాటించే పుష్టి మత స్థాపానాచార్యులైనారు. క్రీ.శ.1479లో (విక్రమార్క శకం 1535) చైత్ర కృష్ణ పక్ష ఏకాదశి (వరూధినీ ఏకాదిశి) నాడు లక్ష్మణ భట్టు, ఎలమగర దంపతులకు రెండవ కుమారునిగా వల్లభుడు అవతరించారు. 100 సోమ యాగాలు చేశాక, తాను తమ వంశంలో ఉదయిస్తానని శ్రీకృష్ణ భగవానుడు వల్లభుని పూర్వజులైన యజ్ఞ నారాయణాచార్యులకు చేసిన ఆదేశానుసారం ఆయన తర్వాతి వారైన లక్ష్మీనారాయణ భట్టు శతాధిక సోమయాగాలు పూర్తి చేసిన క్రమంలో కాశీలో వల్లభుడు భువిపై అవతరించారు.
బాల్యం నుండే వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు పఠించి, తర్వాతికాలంలో ఆది శంకర, రామానుజ, మధ్వాచార్య, బౌద్ధ, జైనాది సిద్ధాంతాలపై ఆమూలాగ్రంగా అవగాహన పొంది, దేశం నలు మూలలా పర్యటించి భక్తి మార్గ నిర్దేశకులైనారు. భగవత్ సాన్నిహిత్య సాథనకు సాధువులే కానక్కర లేదని, కౌటుంబిక జీవన విధానంలోనూ కృష్ణ భగవానుని భక్తితో కొలిస్తే, ముక్తి లభించ గలదనే కొత్త సాంప్రదాయానికి పురుడు పోసారు. ఈ కొత్త ప్రతిపాదన ప్రభావం చూపి, వందలాదిగా వల్లభుని అనుసరించారు. వైష్ణవ మత వ్యాప్తికి నడుం బిగించి, దేశాటన చేస్తూ, వివిధ చోట్ల భిన్న మతస్తులతో వాదోపవాదాలు జరిపి, తన మతానికి మళ్ళించారు. శ్రీకృష్ణ దేవరాయల దర్బారులో మధ్వాచార్య, శంకరాచార్య అనుయాయుల మధ్య జరిగిన చర్చలో పాల్గొని, 27రోజులు విస్తృతంగా చర్చించి, శైవులను ఓడించి, సభికులను ఒప్పించి, మెప్పించి, కనాకాభిషిక్తులైనారు. అదే సమయంలో ఆచార్య, జగద్గురు బిరుదాంచితులైనారు. ఉజ్జయిని, ప్రయాగ, కాశీ, హరిద్వార్, బదరీనాథ్, కేదార్‌నాథ్ తదితరాలను సందర్శించి, చివరకు మధుర వద్ద బృందావనంలో కొంతకాలం గడిపారు. శ్రీకృష్ణుడు స్వప్న సాక్షాత్కారియై, గోవర్ధనగిరిపై శ్రీనాథ విగ్రహం కలదని. దాన్ని వెలికి తీసి, ఆలయం నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ చేసి, పూజాదికాలు జరిగేలా చూడాలనే ఆదేశానుసారం 1520లో శ్రీనాథాలయం నిర్మించారు. అందుకే వల్లభుని మతాన్ని శ్రీనాథ మతం అంటారు. చివరికి కాశీలో స్థిర పడ్డారు. బాదరాయణ బ్రహ్మసూత్రాలకు, జైమినీ పూర్వ మీమాంస సూత్రాలకు అనుభాష్యం రచించారు. భాగవత దశమ స్కందానికి సుబోధిని వ్యాఖ్యాన గ్రంథ రచన చేశారు. మధురాష్టకం, చతుశ్లోకి, వచనామృతం, భాగవత ఏకాదశ స్కందార్థ నిరూపణ కారిక, భక్తివర్ధిని, అంతఃకరణ ప్రబోధ, సిద్ధాంత రహస్యం, పుష్టి ప్రవాహ మర్యాద, శ్రీకృష్ణ జన్మపత్రిక, పురుషోత్తమ సహస్ర నామాలు, శ్రీయుమునాష్టకం, సిద్ధాంత ముక్తావళి, నవరత్నం లాంటి గ్రంథాలెన్నో విరచించారు. శంకరాచార్యుని సిద్దాంతాలతో విభేదించి, మాయావృతం కాని పరబ్రహ్మమే పరమ సత్యమని ప్రతిపాదించిన కారణంగానే ఆయన వాదానికి శుద్ధాద్వైతమనే నామం శాశ్వతమైంది. 1531లో తమ 52వ ఏట శ్రీనాధుని ఆజ్ఞానువర్తియై, ప్రాపంచిక జీవితాన్ని వదిలి, గంగానదిలో జల సమాధియైనారు.

- సంగనభట్ల రామకిష్టయ్య, 9440595494