భాస్కర వాణి

వర్సిటీల ధుర్గతికి కారకులెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజగృహంలోని సాలవతి అనే పరిచారిక పుత్రు డు జీవకుడు. అతడు రాజ కుమారుడైన అభయుని చేతిలో పెరిగాడు. కొన్నాళ్లకు జీవకుడు ఏదైనా కళను అభ్యాసం చేయాలని సంకల్పించి తక్షశిల విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. గొప్ప ఆయుర్వేద పండితుని దగ్గర శిష్యుడై ఏడేండ్లు విద్యాభ్యాసం చేశాడు. తన విద్యాభ్యాసం ఎప్పుడు పూర్తవుతుందని గురువును అడిగినపుడు- ఆయన ఓ పరీక్ష పెట్టాడు. జీవకుడికి ఓ పారను ఇచ్చి తక్షశిల కేంద్రంగా ఓ యోజనం దూరంలోని మొక్కలను పరీక్షించి ఔషధానికి పనికిరాని మొక్కను తెమ్మన్నాడు. జీవకుడు తిరిగివచ్చి ‘ఔషధానికి ఉపయుక్తం కాని మొక్క ఒక్కటి కూడా నాకు కన్పించలేద’ని అన్నాడు. దాంతో గురువు సంతోషించి నీ వైద్యవిద్య పూర్తయ్యిందని ఇంటికి పంపించాడు.
ఈ జీవకుడే ఓ పెద్ద వ్యాపారి భార్యకు గొప్ప వైద్యం చేసి 16 వేల కార్షపణములు, రథాలు బహుమతిగా పొం దాడు. అలాగే, బింబిసార చక్రవర్తి మూలశంక వ్యాధిని ఇతను తగ్గించినట్లు బౌద్ధ సాహిత్యంలోని వినయపిటకం వల్ల తెలుస్తున్నది. ఇలాంటి విద్యలను అందించిన గొప్ప విశ్వవిద్యాలయాలకు నిలయం భారతదేశం. తక్షశిల, విక్రమశిల, నలంద, శ్రీపర్వతం వంటివి భారతీయ విద్యలకు, కళలకు పుట్టినిళ్లుగా భాసిల్లాయి. యువాన్ చాంగో, ధోన్-మి వంటి విదేశీయులు మన విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం చేశారు. గుణమతి, స్థిరమతి ప్రభామిత్రుడు, జ్ఞానచంద్రుడు, జినమిత్రుడు, ధర్మపాలుడు, నాగార్జునుడు వంటి గొప్ప విద్యావేత్తలు ఆ విద్యాసంస్థల్లో ప్రబోధకులు. వైదిక గ్రంథాలు, హేతువిద్య, శబ్దవిద్య, యోగశాస్త్రం, రసవాదం, సాంఖ్యవిద్య, చికిత్స విద్య వంటివి నేర్పించిన ఈ విశ్వవిద్యాలయాలు జగత్ప్రసిద్ధి పొందాయి. కేవలం నలందా విశ్వవిద్యాలయంలోనే 10 దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, 9 అంతస్థుల గ్రంథాలయం, 2వేల మంది ఆచార్యులకు వసతి గృహాలు, 10,500 మందికి విద్యాభ్యాసం చేసేలా వసతులుండేవంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. చైనా, టిబెట్, కొరియా, ఇండోనేషియా, పర్షియా, టర్కీల నుండి విద్యార్థులు వచ్చి ఇక్కడ విద్యాభ్యాసం చేసేవారు.
క్రీ.శ.427 నుండి 1197 వరకు నలందా విశ్వవిద్యాలయం మన దేశ విద్యా వ్యవస్థకే తలమానికం. మరి ఇలాంటి విద్యాలయం ఎక్కడ మాయమైంది? బక్తియార్ ఖిల్జీ అనే మతోన్మాది చేసిన విధ్వంసంలో ఈ విద్యాసుమం మాడి మసైపోయింది. బౌద్ధ సన్యాసులను చంపేసి, మరికొందరిని తరిమేసి, గ్రంథాలయాలను ఖిల్జీ తగులబెడితే అది మూడు నెలల పాటు తగులబడిందని యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ మాజీ డీన్ జెఫ్రీ గార్డన్ ‘న్యూయార్క్ టైమ్స్’లో రాసాడు.
కానీ, ఇటీవల కొందరు మేధావులు అజ్ఞానంతో న లంద, తక్షశిల వంటి విద్యాలయాలను హిందువులు ధ్వంసం చేశారని దుప్ప్రచా రం మొదలుపెట్టారు. ఇంత చారిత్రక అజ్ఞానులు మేధావులా? ఇదంతా చెప్పడానికి ఓ కారణం ఉంది. ఇటీవల మన దేశంలో విశ్వవిద్యాలయాలు దేశ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారాయి. ఇక్కడున్న అందరూ అలా అని చెప్పలేం గాని కొందరు విద్యాలయాలను రాజకీయ శిక్షణ కేంద్రాలుగా మలచుకొంటున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడికిన సంగతి మనకు తెలిసిందే. అలాగే ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ), ఢిల్లీ విశ్వవిద్యాలయం (డియూ), యూపీలోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం వంటివి ఇటీవల ఎన్నోసార్లు వార్తల్లోకెక్కినవే.
ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన అనేక సంఘటనల తర్వాత ఇటీవల జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల్లో జాతీయవాద విద్యార్థి సంఘం గెలుపొందింది. కొన్ని యూనివర్సిటీల్లో ఉద్యోగాలు సంపాదించి మేధావులుగా చలామణి అవుతున్న కొందరు- ‘యూనివర్సిటీలు భ్రష్టుపట్టాయి’ అంటూ క్రొత్త సంచలనాలు రేపుతున్నారు. ముంబయి బాంబు పేలుళ్లలో వందలాదిమందిని బలి తీసుకొన్న యాకూబ్ మెమన్ అనే తీవ్రవాదికి కోర్టు శిక్ష వేస్తే అతనికి నివాళులు అర్పించి నినాదాలు చేసినపుడు విశ్వవిద్యాలయాలు భ్రష్టుపట్టలేదా? ‘రెండు దేశాల సిద్ధాంతాని’కి పితామహుడైన మహమ్మదాలీ జిన్నా (పాకిస్తాన్) చిత్రపటాన్ని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో తగిలించినపుడు యూనివర్సిటీల పతనం గుర్తుకు రాలేదా? అదే విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేసి కశ్మీర్ లోయకు వెళ్లి తీవ్రవాదం రేకెత్తించిన మన్నాన్ వనీని మన భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో చంపేశాయి. అలాంటి కరడుగట్టిన తీవ్రవాదికి అలీగఢ్ ముస్లిం వర్సిటీలో కొందరు విద్యార్థులు ప్రొఫెసర్ల పరోక్ష మద్దతుతో నివాళులు అర్పించినపుడు విశ్వవిద్యాలయాలు పతనం వైపు వెళుతున్నట్లు ఈ మేధావులకు ఎందుకు అన్పించలేదు.
ఇంకా దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల్లో బీఫ్ ఫెస్టివల్స్, ‘లవ్ ఆఫ్ కిస్’ వంటి కార్యక్రమాలు చేసినపుడు విద్యార్థులు పెడద్రోవ పడుతున్నట్టు ఈ ‘ఎర్ర’ మెదడు మేధావులకు కన్పించలేదా? ‘ఆజాదీ’ పేరుతో కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ వంటి విద్యార్థి నేతలు చెలరేగిపోయి ప్రసంగాలు చేసి విశ్వవిద్యాలయ విద్యార్థులను రెచ్చగొట్టినపుడు విద్యా విలువలు గుర్తుకురావా?
విశ్వవిద్యాలయాలకున్న స్వయం ప్రతిపత్తిని, అస్తిత్వాన్ని ఆధారం చేసుకొని ‘్భవస్వేచ్ఛ’ పేరుతో చెలరేగిపోవడం ఎంతవరకు సబ బు? దేశానే్న ప్రమాదంలోకి నెట్టే ఆలోచనలు చేసే విచ్ఛిన్నర శక్తులకు విశ్వవిద్యాలయాలు నిలయాలుగా మా రాలా? సెమినార్లు, సదస్సులు విద్యార్థుల పరిశోధనా శక్తికి, సృజనాత్మకతకు కేంద్ర బిందువు కావలసింది పోయి తమకు నచ్చనివారిపై దుమ్మెత్తిపోసే విష సంస్కృతిని ‘సిన్సాప్సిన్’గా మార్చడం సరైందా? పత్రికలను, ప్రసార మాధ్యమాలను అడ్డం పెట్టుకొని మేధావులుగా చెలామణి అవుతూ తమ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిప్పించుకొన్న ఘనత- ‘గొప్ప తాత్విక, చారిత్రక, విద్యా వ్యవస్థ పరిణతి తెలిసిన’ మేధావులది! దార్శనికత, అభ్యుదయ ప్రాపంచిక దృక్పథం ఉన్న మన తొలితరం నాయకులకు రాజకీయ అధికారం అప్పజెప్పి సాంస్కృతిక, కళా, సాహిత్య, విద్యా రంగాల్లో తిష్ట వేసుక్కూచుని ‘ప్రజాస్వామ్యం’ అని కబుర్లు చెప్పిన ‘అవార్డు వాపసీ గ్యాంగ్’ ఈ డెబ్భై ఏళ్ళలో విద్యారంగాన్ని భ్రష్టుపట్టించింది. ఈ వ్యవస్థ అంతా ఇప్పటివరకు వీళ్ల చేతుల్లోనే కదా ఉన్నది?
ఇంకా బహుజనులకు విద్యారంగంలో, పరిశోధనా రంగంలో కష్టాలు ఎందుకు ఎదురవుతున్నాయి? నాయకులు ‘అధికారమే జ్ఞానం’ (పవర్ ఈజ్ నాలెడ్జ్) అనుకుంటే, ఈ మేధావులు ‘జ్ఞానమే అధికారం’ (నాలెడ్జ్ ఈజ్ పవర్) అనుకొంటున్నారు. తత్వదృష్టితో చూస్తే ఈ రెండూ నాణేనికి ఇరు పార్శ్వాలే! రెండింటిలో ఒకటి తామసాహంకారం, రెండవది సాత్వికాహంకారం. అంతే తేడా! ఇంతలో గొంతులు చించుకునే ఈ గద్దె దిగిన ప్రొఫెసర్లు, మేధావులు, వాళ్ల బాకాలు ఇనే్నళ్లలో మన విశ్వవిద్యాలయాలను ప్రపంచ ప్రతిష్ఠ వున్న 200 విశ్వవిద్యాలయాలతో సమానంగా ఎందుకు చేయలేకపోయారు? జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మొదటి వైస్ చాన్సలర్ పార్థసారధి, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్థాపించిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్‌లను నెత్తిన పెట్టకొని ఊరేగే ఈ వంది మాగధులు ఇపుడు అక్కడ జరుగుతున్న దేశ విద్రోహ చర్యలను ఏనాడైనా ప్రశ్నించారా? జెఎన్‌యు విశిష్టత ‘ప్రశ్నించే తత్వంలో వుంది’ అంటూ ‘మార్క్సిస్ట్ మదర్సా’గా మార్చిన తుక్డే తుక్డే గ్యాంగుకు వ్యతిరేకంగా ఈ ‘విశ్వవిద్యాలయ పరిరక్షకులు’ నోరు తెరచి మాట్లాడగలరా? సెంట్రల్ యూనివర్సిటీలో కులాల సంఘర్షణతో అరాచకం సృష్టించాలనుకొన్న శక్తులు- విద్యార్థి సంఘ ఎన్నికల్లో జాతీయవాదం గెలవగానే దుష్ప్రచారం మొదలుపెట్టాయి. ఈ డెబ్భై ఏళ్లలో పెట్టుబడిదారీ వ్యవస్థలేని రాజ్యంగా భారత్‌ను నిర్మించినట్లు ఈ ‘చైనా రష్యా భక్తులు’ పోజులిస్తున్నారు. ఇపుడు ‘్ఫసిజం’ అనే కొత్త పదాన్ని సృష్టించి చేస్తున్న ప్రచారం పసిగట్టకపోతే దేశానికే పెను ప్రమాదం.

-డాక్టర్ పి.భస్కర యోగి bhaskarayogi.p@gmail.com