భాస్కర వాణి

కమ్యూనిస్టులు ఇంకెప్పుడు మారుతారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దేశవ్యాప్తంగా ఐక్యతతో జీవిస్తున్న ప్రజానీకం మధ్య మతం,కులం,జాతి,ప్రాంతం అంటూ విభజన రేఖలను సృష్టించి, భయోత్పాత వాతావరణానికి హిందుత్వ కారణమవుతోంది.. ఇపుడు లౌకికవాదం వర్సెస్ హిందుత్వ అనే అంశంపై చర్చ జరగాలి.. మా పార్టీ లౌకిక భావాల రక్షణ కోసం పోరాడుతుంది.. మతోన్మాదుల చేతిలో ఈ దేశం ఉండడం అత్యంత ప్రమాదకరం’- ఈ అమృతవాక్కులు వెలువడింది సిపిఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నోటి నుండి..!
‘‘ఊరంతా ఓ దారి అయితే ఉలిపికట్టెది ఇంకోదారి’’ అన్న సామెతలా ఈ దేశ కమ్యూనిజం జడపదార్థం కాగా, ఇక్కడి కమ్యూనిస్టు నాయకులు ఎదుగూ బొదుగూ లేని కుక్కమూతి పిందెల్లా కార్యకర్తలను మార్చివేశారు. పీడిత, తాడిత ప్రజల కోసం పనిచేసే మన కమ్యూనిస్టుల అగ్రపీఠాల్లో ఎప్పుడూ అగ్రకులాల వాళ్లే కూర్చోవడం మరో ప్రత్యేకత. సహజ వనరులు, అక్షరాస్యత, తీరప్రాంతం అధికంగా ఉన్న కేరళ అభివృద్ధి చెందిందంటే అది తమ చలవే అని చెప్పుకొనే కమూనిస్టులు- జ్యోతిబసు, బుద్ధదేవ్ భట్టాచార్య వంటి యోధుల చేతుల్లో రెండు దశాబ్దాలకు పైగా బెంగాల్ పరిపాలింపబడినా ఇప్పటికీ ఎందుకంత దీనస్థితిలో వుందో చెప్పే గతి తర్కం వారి దగ్గర లేదు.
వాళ్లు రోజూ దళిత, బహుజనుల పేర్లు ఉచ్ఛరించనిదే ఉపన్యాసమే చేయరు. కానీ ఈ దేశానికి ఓ బహుజనుడు మొదటిసారి ప్రధాని అయితే ఓర్చుకోరు. ఓ దళితుడు రాష్టప్రతి అయితే వంకలు పెడతారు. డా బాబాసాహెబ్ అంబేడ్కర్ తనను కమ్యూనిస్టులు లక్ష్యపెట్టనందువలనే కదా- ‘‘నేను దళితులకు, కమ్యూనిస్టులకు మధ్య ఇనుపగోడను అవుతాను’’ అన్నాడు. రామ్‌నాథ్ కోవింద్‌లో రాముడుండడం వాళ్లకు నచ్చదు కానీ, సీతారాం ఏచూరిలో ‘సీతారాం’ ఉండవచ్చు, బి.వి.రాఘవులులో ‘రాఘవుడు’ ఉండొచ్చు! ఇది ఏం గతి తార్కిక భౌతికవాదం కామ్రేడ్! అమిత్ షాకు హోం మంత్రి పదవి ఇస్తే ‘దొంగకు తాళం చెవి ఇచ్చినట్టే’ అని సీపీఐ నేత కె.నారాయణ తన దూషణ పర్వం చేయొచ్చు; మరి మీ తోబుట్టువు కేరళ సీఎం పినరయ్ విజయన్ చరిత్రను ఎవరు అధ్యయనం చేయాలి? ఎన్నికల్లో గెలిచి నెల కూడా దాటకుండా మళ్లీ పాడిందే పాటగా జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు అంటూ ‘ఎర్ర’కూతలు కూయడం ప్రజాస్వామ్య గౌరవం ఎలా అవుతుంది కామ్రేడ్!
మహారాష్ట్ర రైతులతో లాంగ్‌మార్చ్ నాసిక్ నుండి ముంబయి వరకు వెనుక ఉండి నడిపింది ఎర్రదండు అని అందరికీ తెలుసు! 2014కు ముందు మన రైతులు బంగారు నాగళ్లతో దున్ని వజ్రాలు పండించే వారనుకుంటా! ఎందుకంటే అప్పటివరకు ఈ దేశాన్ని పాలించిన అధికార పార్టీలను మోసిన బోరుూలు వీరే కదా! అది రామరాజ్యం కాదు.. మార్క్స్ రాజ్యం!?
ప్రపంచాన్ని ఉద్ధరించేందుకు పుట్టిన మార్క్సిజం ఇపుడు భారత్‌లో ఓ మతంలా అవతారం ఎత్తింది. భారత కమ్యూనిస్టులకు ఆర్థిక సమానత్వం కన్న ఓ మతంపై యుద్ధం చేయడమే ప్రధాన ఎజెండా. అదీ ముఖ్యంగా హిందూమతంపై దాడి చేయడమే వారి దృష్టిలో గొప్ప సెక్యులరిజం. మత రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారా? మతాలను వ్యతిరేకిస్తున్నా రా? అన్ని మత తత్వాలను వ్యతిరేకిస్తున్నారా? హిందూ మతాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారా? లేక మత ప్రమేయం లేని వ్యవస్థను కోరుకొంటున్నారా? వాళ్లకే క్లారిటీ లేదు. అదే వాళ్ల దీనస్థితికి కారణం. 170 ఏళ్ళ క్రితం యూరప్‌లో ఏ పరిస్థితులున్నాయో ఇప్పటికీ అవే ఉన్నాయని కమ్యూనిస్టులు భావిస్తారు. అందుకే అమెరికాపై గుడ్డి వ్యతిరేకత. కారల్ మార్క్స్, ఏంగిల్స్ 150 ఏళ్ళ క్రితం ఏర్పాటుచేసిన ‘‘మొదటి ఇంటర్నేషనల్’’ ఎందుకు వైఫల్యం చెందిందో చెప్పరు. పాలస్తీనాపై ప్రేమతో భారత్‌కు నమ్మదగిన మిత్రదేశమైన ఇజ్రాయిల్‌పై కత్తి కట్టారు. జిన్నాకు మద్దతుగా పాకిస్తాన్ ఏర్పాటును స్వాగతించిన వామపక్షాలు భారత్ పక్షాన ఇంకెప్పుడు నిలబడతారు?
భావస్వేచ్ఛను ఓ అంతర్జాతీయ సూత్రంగా పెట్టుకొని కొందరిని మాత్రమే టార్గెట్ చేయడం కమ్యూనిస్టుల ద్వంద్వ వైఖరికి నిదర్శనం. యూరప్ దేశాల్లో పారిశ్రామిక విప్లవం వచ్చాక ఆ కార్మికులే సమ సమాజ స్థాపన కోసం పనిచేస్తారనే భ్రమలో ఈ దేశ కమ్యూనిస్టులు ఉంటున్నారు. యంత్రం, విజ్ఞానం దూసుకుపోతున్న ఈ తరుణంలో కార్మికుడు క్యాపిటలిస్ట్‌గా మారుతున్న కాలంలో గతి తార్కికవాదం మతి తప్పి మతం గురించి మాట్లాడుతుందా? అందుకే రోజూ వామపక్షాల ప్రకటనల్లో, వారి మేధావుల రాతల్లో, వారు ఏర్పాటుచేసిన మీడియా తలరాతల్లో ఎక్కడా అభివృద్ధి అంశాలకు స్థానం కన్పించడం లేదు. ‘మతోన్మాదాన్ని అడ్డుకొంటాం’ అన్నది ఇప్పటి కమ్యూనిస్టు నాయకుల, మేధావుల కొత్త నినాదం. ‘మతం మత్తుమందు’ అని మార్క్స్ చెప్పినందువల్ల దానిని తూ.చ తప్పకుండా మతతత్వ వాదుల్లా కమ్యూనిస్టులు కమ్యూనిజాన్ని ‘మతం’గా మార్చారా? ఇప్పుడేదో గజనీలు, ఘోరీలు అరేబియా నుండి దండెత్తుతుంటే అడ్డుకునే వీరయోధుల్లా రోజూ ప్రకటనలు! ఇపుడేమైనా చైనాలాగా మసీదులకు తాళం వేసి మదర్సాలను మూసేస్తారా? బాబర్, ఔరంగజేబు చరిత్రలను చెరిపేసి వాళ్ల గొప్పతనాలను దాచిపెట్టి శివాజీ శౌర్యాన్ని, రాణాప్రతాప్ రౌద్రాన్ని బోధిస్తున్నారా? రోమిల్లా థాపర్, రామచంద్ర గుహలను తమ వ్యాసాలు రాయనివ్వడం లేదా? జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని మూసేశారా? కన్హయ్య కుమార్‌ను ఎన్నికలలో పోటీ చేయకుండా ఆపేయగలిగారా? మేధావుల పేర్లు తగిలించుకుని టీవీ చానళ్లలో పోజులిస్తున్న వాళ్లను మాట్లాడనివ్వడం లేదా? ఇపుడు దేశానికి హిందూమతం వల్ల ఏం ప్రమాదం వచ్చి పడింది?
నాలుకకు నరం లేకుండా ఈ దేశ ప్రధానిపై అవాకులు చవాకులు పేలిన కె.నారాయణ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కదా! పాకిస్తాన్ వెళ్లి ‘‘మోదిని దించేందుకు మాకు సహకరించండి’’ అని అంతర్జాతీయ టీవీ చానళ్లలో మాట్లాడిన మణిశంకర్ అయ్యర్ హాయిగా ఉన్నాడు కదా! ఎన్నోసార్లు పార్లమెంటులో ఒక్కడే సభ్యుడుగా వున్న అసదుద్దీన్ ఓవైసీ ఎన్నిసార్లు ప్రధానిని విమర్శించలేదు? ఆయనను ఎవరైనా అడ్డుకున్నారా? బద్రుద్దీన్ అజ్మల్, మహమ్మద్ సలీం లాంటివారు ఎన్నిసార్లు కారుకూతలు కూయలేదు. వాళ్లపేరైనా ప్రస్తావించాడా ఈ దేశ ప్రధాని! అతనిపై అగ్రకుల కమ్యూనిస్టులకంత ద్వే షం. అతను ప్రస్తావించే జా తీయవాదంపై అంత అక్క సు ఎందుకు? సమ సమాజ స్థాపన కోసం 30 ఏళ్ళు స్టాలిన్ నియంతృత్వాన్ని రష్యా భరించింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాలు దండెత్తివస్తే ‘రష్యన్ జాతీయత’ ఎందుకు తెరపైకి వచ్చింది? ఇవి అర్థం చేసుకోకుండా కేవలం హిందుత్వపై దాడికే కమ్యూనిజం ఉందన్నట్లు భారతీయ కమ్యూనిస్టుల వేషాలు చూసి ఈ దేశ ప్రజలకు మొహం మొత్తింది.
1920లో భారత్‌లో పురుడు పోసుకున్న కమ్యూనిస్టు పార్టీ ఏ విధంగా చూసినా ఓ సుదీర్ఘ కాలఖండం. కానీ దాని తర్వాత ఈ దేశంలో 10 మంది చిన్నపిల్లల మధ్య 1925లో డాక్టర్ హెగ్డేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఈరోజు ఓ వటవృక్షం. కాలపరీక్షకు నిలవని సిద్ధాంతంతో కమ్యూనిస్టు పార్టీ అనేక ముక్కచెక్కలయి ఇస్లామిక్ మతవాదాన్ని తలకెత్తుకొని నడువలేక, కుంటలేక కునారిల్లుతున్నది. 1920లో తాష్కెంట్‌లో యం.యన్.రాయ్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమ్యూనిస్టు పార్టీ 1964 ఏప్రిల్ 11 తర్వాత సిపిఐ(ఎం)గా, 1967లో సిపిఐ(ఎం) నుండి చీలిపోయి 1969లో సిపిఐ (యంఎల్)గా.. ఆ తర్వాత అనేక ముక్కలుగా మారి కకావికలమైంది. నిజానికి సిపిఐ(ఎం) ఓ పెద్ద శక్తిగా మారి బెంగాల్, త్రిపురల నుండి క్రమంగా మాయమై, కేరళలో అంపశయ్యపై ఉంది. మొన్న కరడుగట్టిన సిపియం సెక్యులర్ ఓటంతా కాంగ్రెస్‌కు షిప్ట్ అయ్యింది. 2024లోనో, 2029లోనో అది భాజపాకు షిఫ్ట్ అవ్వడం ఖాయం.
ఒకప్పుడు ప్రభుత్వాలను నిలబెట్టగల, కూల్చగల సామర్థ్యం వున్న కమ్యూనిస్టులు ఇవాళ ఇంతలా కునారిల్లిపోవడానికి కారణం ఏమిటి? ఇండియాలో పుట్టిన ఏ తత్వవేత్తను కూడా కమ్యూనిస్టులు స్వంతం చేసుకోలేదు. ఈ దేశ పురాణ ఇతిహాసాల్లోని మంచిని స్వీకరించకుండా దానిపై అదేపనిగా దాడిచెయ్యడం ప్రజలకు వారిని దూరం చేసింది. అర్జెంటీనాకు చెందిన వైద్య శాస్తప్రట్ట్భద్రుడు చెగువేరాపై వున్న ప్రేమ ఈ దేశంలో పుట్టిన నేతాజీపై లేదు. బొలివీయా, క్యూబా, కెన్యాల్లో చెగువేరా సాయుధ పోరాటాన్ని ప్రేమించే ఈ దేశ కమ్యూనిస్టులు ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను స్థాపించి, స్వాతంత్య్రం కోసం ఈ నేలపై ఉద్యమించిన ఎందరో వీరులను తిరస్కరించినట్టే నేతాజీని తిరస్కరించి తులనాడారు. ఇపుడు నరేంద్ర మోదీ విధానాల మీద కాకుండా వ్యక్తిపై పోరాటం మొదలుపెట్టారు. ఇది ఎస్.ఎ.డాంగే, పి.సి.జోషి, బి.టి.రణదివె, డాఅధికారి, ముజఫర్ అహ్మద్, నంబూద్రిపాద్‌ల కాలం కాదు. పత్రికలను, మేధో సాంస్కృతిక రంగాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకొని ఏదైనా రాసి జనాన్ని నమ్మించడం సాధ్యం కాదు. ఇపుడు రాజ్‌దీప్ సర్దేశాయి భాషలో ‘నెట్ హిందువులు’ మేల్కొన్నారు.
ఇక్కడి దేశీయ సంస్కృతిని అర్థం చేసుకోకుండా, ఒకవేళ అందులో ఏవైనా తప్పులుంటే సరిచేయకుండా గుడ్డి వ్యతిరేకతతో ముందుకెళుతున్న వామపక్షాలకు రానున్న రోజులు మరింత గడ్డుకాలమే. ఇంకో ఇరవై ఏళ్ళకు సమీక్షించుకొని తమ చారిత్రక తప్పిదాలను లిస్ట్‌లో ఎక్కించేందుకు వెళ్తే కలియుగం సగం భాగం పూర్తవ్వడం ఖాయం. ‘ఏం చేయాలి?’ అన్న లెనిన్ పుస్తకం చదివి ఏ ఉద్యమం చేయాలో నిర్ణయించుకునే కమ్యూనిస్టులు భారతీయతను తెలుసుకోవడానికి కూడా మావో సేటుంగ్ తత్వం అధ్యయనం చేస్తారా?

-డా పి.భాస్కరయోగి