ఆంధ్రప్రదేశ్‌

భూమా చేరికతో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భూమా నాగిరెడ్డి తిరిగి టిడిపిలో చేరాక ఇపుడు మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలైనట్లు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. తన వర్గానికి చెందిన సర్పంచ్ తులసిరెడ్డిపై మంగళవారం రాత్రి కత్తులతో దాడి జరిగిందని, ఈ ఘటనకు భూమా కారకుడని ఆయన ఆరోపించారు. తులసిరెడ్డి కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని శిల్పా మోహన్‌రెడ్డి సోదరులు ఈరోజు పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. పార్టీలో తను ఉండకుండా చేయాలన్నదే భూమా కుట్ర అని మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు.