జాతీయ వార్తలు

బీజేపీలో చేరిన అనర్హత ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు:కర్ణాటకలో అనర్హత ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆ ఎమ్మెల్యేలంతా బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారంనాడు ముఖ్యమంత్రి యడియూరప్ప సమక్షంలో వారు బీజేపీలో చేరారు. వారందరికీ యెడియూరప్ప కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. డిసెంబర్‌ 5న 15 స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికల్లో వీరంతా బీజేపీ తరపున పోటీ చేయనున్నారు. ఆ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపారని, ఈ మేరకు సీనియర్ నేతలను కలిశారని ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్ తెలిపారు.