ఆంధ్రప్రదేశ్‌

బోటు వెలికి తీశారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద పర్యాటకులతో వెళుతూ నీట మునిగిన వశిష్టా రాయల్ బోటును ఎట్టకేలకు వెలికితీశారు. ధర్మాడి సత్యం బృందంతో పాటు స్కూబా డ్రైవర్లు తీవ్రంగా కృషి చేసి బోటును వెలికితీశారు. కాగా బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో ఇంకా పదిమంది ఆచూకీ తెలియాల్సివుంది. ప్రమాదంలో 77 మంది చిక్కుకోగా 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. శనివారం వరకు 40 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదివారం బోటు వెలికి తీత సమయంలో ఒక చిన్నారి అస్థిపంజరం బోటు నుంచి బయటపడింది.ప్రమాద సమయంలో బోటులో 51 మంది గల్లంతయ్యారని, ఇప్పటి వరకు 40 మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో 11 మంది జాడ తెలియాల్సి వుందన్నారు.