జాతీయ వార్తలు
సింగరేణి కార్మికులకు 28శాతం బోనస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 September 2019
హైదరాబాద్: సింగరేణ సంస్థ లాభాల్లో 28శాతం కార్మికులకు బోనస్గా ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయన గురువారంనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ దీనివల్ల ఒక్కొక్క కార్మికుడికి రూ.1,00,899లు బోనస్గా లభిస్తుందని, గత ఏడాది కంటే రూ.40,530 అదనంగా పొందనున్నారని తెలిపారు. హోంగార్డులకు మన ప్రభుత్వం ఇస్తున్న వేతనం ఏ రాష్ట్రంలోనూ ఇవ్వటం లేదని అన్నారు. అలాగే పోలీసులకు వారాంతపు సెలవు అమలు విషయంపై ఉన్నతాధికారులతో చర్చించాల్సి ఉందని అన్నారు. తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని ఆయన కితాబునిచ్చారు. డిసెంబర్ లేదా జనవరికల్లా కమాండ్ కంట్రోల్ పూర్తి కావొస్తొందని తెలిపారు.