ఆంధ్రప్రదేశ్
కలకలం రేపుతున్న బాలుడి అదృశ్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 January 2016
గుంటూరు : గుంటూరు జిల్లా రెంటచింతల మండలం పసర్లపూడికి చెందిన తొమ్మిది నెలల బాలుడు ఏసుబాబు అదృశ్యం కలకలం రేపుతోంది. వైద్యం చేయించేందుకు మంగళవారం అతని అమ్మమ్మ దగ్గుబాటా హుసేనమ్మ ఆసుపత్రికి తీసుకొచ్చి పిల్లల వార్డులో చేర్పించింది. బుధవారం ఉదయం అల్పాహారం తీసుకొచ్చేందుకు బయటికి వెళ్తూ... తన మనవడిని చూస్తూ ఉండమని మరో మహిళకు అప్పగించి బయటకు వెళ్లింది. తిరిగొచ్చే సరికి ఆ మహిళ, మనవడి ఆచూకీ లేకపోవడంతో కన్నీటి పర్యంతమైంది. వెంటనే ఆసుపత్రిలోని ఔట్పోస్టు పోలీసులకు, ఆసుపత్రి సూరింటెండెంట్కు ఫిర్యాదు చేసింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో మంత్రి కామినేని ఫోన్లో మాట్లాడారు.