బిజినెస్

అమ్మకాల ఒత్తిడిలో ఎఫ్‌పిఐలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడులు తరలిపోతూనే ఉన్నాయ. దేశ ఆర్థిక వ్యవస్థపై విదేశీ మదుపరులకు భయాలు పెరుగుతుండటం, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులే దీనికి ప్రధాన కారణం. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో మదుపరు (ఎఫ్‌పిఐ)ల పెట్టుబడులు అంతకంతకూ వెనక్కి వెళ్లిపోతున్నాయ. ఈ నెలలో స్టాక్, రుణ మార్కెట్లలో కలిపి 6,500 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను విదేశీ మదుపరులు ఉపసంహరించుకున్నారు. నవంబర్‌లోనూ ఎఫ్‌పిఐలు 10,826 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేకున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లోనూ అదే దారిలో పయనించగా, డిసెంబర్ 1-23 మధ్య స్టాక్ మార్కెట్ల నుంచి 3,949 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పిఐలు.. ఇదే సమయంలో రుణ మార్కెట్ల నుంచి మరో 2,588 కోట్ల రూపాయల పెట్టుబడులను తిరిగి తీసేసుకున్నారు. దీంతో మొత్తం అటు స్టాక్ మార్కెట్లు, ఇటు రుణ మార్కెట్ల నుంచి డిసెంబర్‌లో ఇప్పటిదాకా 6,537 కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ మదుపరులు ఉపసంహరించుకున్నట్లైంది. నిజానికి పడుతూ లేస్తూ సాగిన ట్రేడింగ్‌లో విదేశీ మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేటు 18 శాతం దిగువనే ఉంటుందని, కాంగ్రెస్ డిమాండ్‌కు అనుగుణంగా 1 శాతం అదనపు పన్నును విరమిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం మదుపరుల దృష్టిని పెట్టుబడుల వైపునకు మళ్లించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ సైతం పుంజుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. ఈ క్రమంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సుధీర్ఘకాలం తర్వాత వడ్డీరేటును పావు శాతం పెంచినప్పటికీ మదుపరులు పట్టించుకోలేదు. అయతే ఈ జోష్ నిలకడగా సాగలేదు. ఇదిలావుంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అటు స్టాక్ మార్కెట్లు, ఇటు రుణ మార్కెట్ల నుంచి 23,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు ఉపసంహరించుకున్నారు. అయతే ఒక్క అక్టోబర్ నెలలోనే తిరిగి 22,350 కోట్ల రూపాయల (3.44 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను పట్టుకొచ్చారు. ఫలితంగా అక్టోబర్ నెల ఏడు నెలల గరిష్ఠానికి ఎఫ్‌పిఐ పెట్టుబడులు చేరినట్లైంది. మార్చి (రూ. 20,723 కోట్లు) తర్వాత మళ్లీ అక్టోబర్‌లోనే భారీగా విదేశీ పెట్టుబడులు దేశీయ మార్కెట్లలోకి తరలివచ్చాయ. కాగా, ప్రపంచ ఆర్థిక మందగమనం మధ్య సెప్టెంబర్‌లో 5,784 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు వెనక్కి తీసుకోగా, అంతకుముందు నెల ఆగస్టులో ఏకంగా 17,524 కోట్ల రూపాయలను గుంజేసుకున్నారు. 1997 నుంచి కేవలం ఒక్క నెలలో భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు ఈ స్థాయలో తరలిపోవడం ఇదే (1997కు ముందు సమాచారం లేదు). మరోవైపు ఈ ఏడాది ఆరంభం నుంచి గమనిస్తే ఏప్రిల్ వరకు దేశీయ మార్కెట్లలో నెలసరి విదేశీ పెట్టుబడులు క్రమేణా తగ్గుతూ వచ్చాయ. జనవరిలో 33,688 కోట్ల రూపాయలుగా ఉన్న ఎఫ్‌పిఐ పెట్టుబడులు.. ఫిబ్రవరిలో 24,564 కోట్ల రూపాయలుగా, మార్చిలో 20,723 కోట్ల రూపాయలుగా, ఏప్రిల్‌లో 15,333 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. మే, జూన్ నెలల్లో పెట్టుబడులు రాకపోగా, వెనక్కి వెళ్లిపోయాయి. మే నెలలో 14,272 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపోయాయ. జూన్‌లో 1,608 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు లాగేసుకున్నారు. జూలైలో మళ్లీ పెట్టుబడుల రాక మొదలైనా.. ఆగస్టులో తిరిగి పెట్టుబడుల పోకడే మిగిలింది. జూలైలో 5,323 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో పరిస్థితులు మళ్లీ గాడిలో పడ్డాయనుకుంటే ఆగస్టులో అందుకు విరుద్ధంగానే ఫలితాలు నమోదయ్యాయ. సెప్టెంబర్‌లోనూ తీరు మారలేదు. అయతే ఆర్‌బిఐ అనూహ్యంగా సెప్టెంబర్ 29న నిర్వహించిన నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లైన రెపో, రివర్స్ రెపోలను 50 బేసిస్ పాయంట్ల చొప్పున తగ్గించడంతో విదేశీ మదుపరుల పెట్టుబడులు పోటెత్తాయ. నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ మార్కెట్లు అక్టోబర్‌లో లాభాల్లో కదలాడాయ. కానీ నవంబర్‌లో పెట్టుబడుల ఉపసంహరణే జరిగింది. డిసెంబర్‌లోనూ అదే తీరు కనిపిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందకపోవడం కూడా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణకు దారితీస్తోంది. మొత్తానికి నానాటికీ షేర్ల అమ్మకాల వైపే ఎఫ్‌పిఐల పయనం సాగుతోంది. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 16,674 కోట్ల రూపాయలుగా ఉంటే, రుణ మార్కెట్లలోకి వచ్చినవి 48,756 కోట్ల రూపాయలుగా ఉన్నాయ.