బిజినెస్

విదేశీ మదుపరులపై నోట్ల రద్దు ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహణ కొనసాగుతోంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈ నెలలో ఇప్పటిదాకా దాదాపు 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, తదనంతర పరిణామాల ప్రభావం కూడా భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. గత నెల అక్టోబర్‌లో 10,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ).. ఈ నెలా అదే దారిలో పయనిస్తున్నారు. నవంబర్ 1-25 మధ్య జరిగిన ట్రేడింగ్‌లో అటు స్టాక్ మార్కెట్ల నుంచి ఇటు రుణ మార్కెట్ల నుంచి 31,917 కోట్ల రూపాయల (4.7 బిలియన్ డాలర్లు)ను తీసుకున్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి 15,763 కోట్ల రూపాయలు, రుణ మార్కెట్ల నుంచి 16,154 కోట్ల రూపాయలు తరలిపోయాయ. నిజానికి సెప్టెంబర్‌లో పెట్టుబడులను తీసుకొచ్చిన మదుపరులు.. అక్టోబర్‌లో మాత్రం వెనక్కి తగ్గారు. ముఖ్యంగా రుణ మార్కెట్ల నుంచి భారీ స్థాయలో పెట్టుబడులను ఎఫ్‌పిఐలు ఉపసంహరించుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్ల తగ్గింపు దీనికి ప్రధాన కారణమని, బాండ్లకు డిమాండ్ తగ్గడంతో రుణ మార్కెట్లు పడిపోయాయని ఎస్‌ఎఎస్ ఆన్‌లైన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిద్ధాంత్ జైన్ అన్నారు. దీంతో రుణ మార్కెట్ల నుంచి అక్టోబర్‌లో 6,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు పోయాయ. కానీ సెప్టెంబర్లో 9,789 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం గమనార్హం. స్టాక్ మార్కెట్ల నుంచి కూడా 4,306 కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కిపోయాయ. దీంతో అటు రుణ, ఇటు స్టాక్ మార్కెట్ల నుంచి అక్టోబర్‌లో 10,306 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయనట్లైంది. ఈ క్రమంలో నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు దేశీయ మార్కెట్లనూ ప్రభావితం చేసింది. అలాగే అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను వచ్చే నెల పెంచనుందన్న సంకేతాలూ విదేశీ మదుపరులను భయ కంపితులను చేస్తున్నాయ. అక్టోబర్‌కు ముందు భారతీయ మార్కెట్లలో పెట్టుబడులపట్ల విదేశీ మదుపరులు ఆసక్తినే కనబరిచారు. సెప్టెంబర్‌లో స్టాక్ మార్కెట్లలోకి 10,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకురావడంతో రుణ, స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలు వచ్చినట్లైంది. గడచిన 11 నెలల్లో ఈ స్థాయలో పెట్టుబడులు రావడం ఇదే ప్రథమం. నిరుడు అక్టోబర్‌లో 22,350 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా, మళ్లీ ఆ తర్వాత ఈ సెప్టెంబర్‌లోనే ఆ స్థాయలో పెట్టుబడులు వచ్చాయ. పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఏకగ్రీవంగా ఆమోదం పొందడం, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను వివిధ సంస్థలు ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండటం వంటివి అటు స్టాక్ ఇటు రుణ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను అమితంగా రప్పించాయ. అంతకుముందు రెండు నెలల్లోనూ విదేశీ పెట్టుబడులు భారతీయ మార్కెట్లలోకి భారీగానే వచ్చాయ. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కరెంట్ ఖాతా లోటు జిడిపిలో 0.1 శాతానికి తగ్గడం, వాహన అమ్మకాలు కూడా ఆశాజనకంగా నమోదు కావడం వంటివి కలిసొచ్చాయ. నిజానికి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన ఎఫ్‌పిఐలు.. తర్వాతి మూడు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో స్టాక్ మార్కెట్లలో 32,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఎఫ్‌పిఐలు గుమ్మరించారు. అంతకుముందు రెండు నెలలతో పోల్చితే మే నెలలో వచ్చిన విదేశీ పెట్టుబడులు మాత్రం తక్కువే. 2,543 కోట్ల రూపాయల పెట్టుబడులే భారత స్టాక్ మార్కెట్లకు వచ్చాయ. ఇక జనవరి, ఫిబ్రవరిలో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకోగా, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఏకంగా 41,661 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. కాగా, ఈ ఏడాది జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
రూ. 10 వేల కోట్లు
ఈ నెలలో ఇప్పటిదాకా దేశీయ స్టాక్ మార్కెట్లలోకి దాదాపు 10,000 కోట్ల రూపాయల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు వచ్చాయ. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో భారతీయ స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల విలువ 31,018 కోట్ల రూపాయలకు చేరింది. మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న క్రమంలో మ్యూచువల్ ఫండ్ మేనేజర్ల నుంచి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.