బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 23: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 205.72 పాయింట్లు పతనమై 30,365.25 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 52.10 పాయింట్లు కోల్పోయి 9,400 మార్కుకు దిగువన 9,386.15 వద్ద నిలిచింది. బ్రిటన్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. సోమవారం సూచీలు లాభాలను అందుకున్నది తెలిసిందే. కాగా, మంగళవారం ట్రేడింగ్‌లో హెల్త్‌కేర్, రియల్టీ, యుటిలిటీస్, పవర్, ఇండస్ట్రియల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా సూచీలు నష్టపోగా, హాంకాంగ్ సూచీ లాభపడింది. ఐరోపా మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు పడిపోగా, బ్రిటన్ సూచీ లాభపడింది.