బిజినెస్

ఒకే ఒక ప్రశ్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయం ఒకే ఒక ప్రశ్నతో ముగిసింది. సాధారణంగా రోజూ పది ప్రశ్నలను చేపడతారు. మండలి సమావేశం కాగానే చైర్మన్ ఎ చక్రపాణి అజెండా ప్రకారం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నలు వేసిన నలుగురు సభ్యులు, సమాధానం ఇవ్వాల్సిన ఐదుగురు మంత్రులు సభకు హాజరు కాకపోవడంతో తొమ్మిది ప్రశ్నలను వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. ఏలూరు పట్టణంలో మురుగు పారుదలకు సంబంధించి సభ్యుడు రాము సూర్యారావు అడిగిన ప్రశ్నకు మాత్రమే పురపాలక మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఏలూరులో మురుగు పారుదల వ్యవస్థను వివిధ గ్రాంట్ల కింద 66 కాలువ పనులను 8.11 కోట్ల రూపాయలతో చేపట్టామన్నారు. ఇతర పథకాల కింద వేర్వేరు పనులను చేపడతామన్నారు. ఇప్పటికే చేపట్టిన పనులను ఈ సంవత్సరం మే వరకు పూర్తి చేస్తామని మంత్రి వివరించారు.