బిజినెస్

నిన్న ‘ఫ్రీడమ్ 251’.. నేడు ‘నమోటెల్ అచ్ఛే దిన్’.. రూ. 99కే స్మార్ట్ఫోన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 18: మొన్నటికిమొన్న ‘ఫ్రీడమ్ 251’ పేరుతో ఓ సంస్థ కేవలం 251 రూపాయలకే ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తామని హంగామా చేసినది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సంస్థ ఏకంగా 99 రూపాయలకే స్మార్ట్ఫోన్ అందిస్తామని ముందుకొచ్చింది. బెంగళూరుకు చెందిన నమోటెల్.. ‘నమోటెల్ అచ్ఛే దిన్’ పేరిట 99 రూపాయలకే స్మార్ట్ఫోన్‌ను విక్రయిస్తామని తెలిపింది. విలేఖరుల సమావేశంలో సంస్థ ప్రమోటర్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17 నుంచే ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయని, 25 వరకు చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ వెబ్‌సైట్ నమోటెల్ డాట్‌కామ్‌పై బుకింగ్స్ సౌకర్యం కలదన్నారు. అయితే ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక సిబ్బంది ఈ వెబ్‌సైట్‌పై బుకింగ్స్ కోసం ప్రయత్నిస్తే వారికి చుక్కెదురైనట్లు తెలుస్తోంది. గతంలో ఫ్రీడమ్ 251 విషయంలోనూ ఇదే తరహా సమస్యలు ఎదురైనది తెలిసిందే. పలు నాటకీయ పరిణామాల మధ్య వాటి బుకింగ్స్ ఆగిపోగా, ఎన్నో విమర్శలు, ఆరోపణలు వ్యక్తమయ్యాయి కూడా. మరి ఈ 99 రూపాయల స్మార్ట్ఫోన్ పరిస్థితి ఏంటో చూడాలి. ఇకపోతే ఈ ఫోన్ డిస్‌ప్లే 4 అంగుళాలు ఉంటుందని, క్వాడ్-కోర్ ప్రాసెసర్, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 1జిబి ర్యామ్, ఒఎస్ ఆండ్రాయిడ్ 5.0, 720-1280 పిక్స్‌ల్స్ రెజల్యూషన్ దీని సొంతమని, బ్యాటరీ సామర్థ్యం 1325 ఎమ్‌ఎహెచ్, స్టోరేజ్ సామర్థ్యం 4జిబి అని నమోటెల్ తెలియజేసింది. అయతే ఫోన్ వాస్తవ ధర 2,999 రూపాయలు అయనప్పటికీ 99 రూపాయలకు తగ్గించినట్లు సంస్థ వెబ్‌సైట్ నమోటెల్ డాట్‌కామ్ చూపిస్తోంది. క్యాష్-ఆన్-డెలివరీపై స్మార్ట్ఫోన్ అందుకోవచ్చంది.

బెంగళూరులో ‘నమోటెల్ అచ్ఛే దిన్’ స్మార్ట్ఫోన్‌ను విలేఖరుల సమావేశంలో చూపిస్తున్న సంస్థ ప్రమోటర్ మాధవ్ రెడ్డి