బిజినెస్

వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 27: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 286.92 పాయింట్లు పుంజుకుని 26,653.60 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 87 పాయింట్లు ఎగిసి 8,156.65 వద్ద నిలిచింది. ఫలితంగా వరుసగా నాలుగు రోజులు మార్కెట్లు లాభాల్లో ముగిసినట్లైంది. చమురు, గ్యాస్, హెల్త్‌కేర్, పిఎస్‌యు, రియల్టీ, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, ఆయా రంగాల షేర్ల విలువ 2.66 శాతం నుంచి 1.15 శాతం మధ్య లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లతోపాటు, ఐరోపా మార్కెట్లలో ఆశాజనక ట్రేడింగ్ దేశీయ సూచీలకు కలిసొచ్చింది.