బిజినెస్

రిలయన్స్ జియో 4జి సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికాం సంస్థ రిలయన్స్ జియో 4జి సేవలు తొలుత రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులకే అందనున్నాయి. ఈ నెల 27న రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ముఖేశ్ తండ్రి అయిన ధీరుభాయ్ అంబానీ పుట్టినరోజు సందర్భంగా రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులందరికీ 4జి సేవలను అందుబాటులోకి తేనుంది రిలయన్స్ జియో. ఈ మేరకు ఉద్యోగులకు పంపిన ఓ ఆహ్వాన పత్రికలో ముఖేశ్ అంబానీ, ఆయన భార్య నితా అంబానీ పేర్కొన్నారు. 27న జరిగే 4జి సేవల ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ పాల్గొననున్నారు.