బిజినెస్

జిఎస్‌టిపై ఆశతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) గాను వివిధ సంస్థలు ప్రకటించే త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుంటాయన్న అంచనాలు, పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందగలదన్న ఆశాభావం భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులను రప్పించాయ. ఈ నెలలో ఇప్పటిదాకా 2 బిలియన్ డాలర్లకుపైగా విదేశీ పెట్టుబడులు భారతీయ క్యాపిటల్ మార్కెట్లలోకి వచ్చాయ. స్టాక్ మార్కెట్లలోకి 8,086 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్లలోకి 6,917 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. దీంతో మొత్తం అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి 15,003 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు ఈ నెల 1-22 మధ్య వచ్చినట్లైంది. మే, జూన్ నెలల్లో దేశీయ మార్కెట్ల నుంచి 4,373 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకున్న నేపథ్యంలో విదేశీ మదుపరులు మళ్లీ ఈ నెలలో పెట్టుబడుల వరద పారించారు. నిజానికి గత నెల వరకు దేశీయ రుణ మార్కెట్ల కంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) ఆసక్తి కనబరిచారు. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలుగుతుందన్న (బ్రెగ్జిట్) భయాలు విదేశీ మదుపరులను రుణ మార్కెట్ల వైపు చూడనివ్వలేదు. బ్రెగ్జిట్‌కే బ్రిటనీయులు మద్దతు పలకడంతో మరింత దూరమయ్యారు. అయతే ఈ నెల మొదలు స్టాక్ మార్కెట్లతోపాటు రుణ మార్కెట్లలోనూ పెట్టుబడులకు మొగ్గు చూపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) నిబంధనలను సరళతరం చేయడం, నూతన ఖనిజ అనే్వషణ విధానాన్ని ఆమోదించడం, షాపింగ్ సముదాయాలు, సినిమా హాల్స్‌ను 24 గంటలు తెరిచేందుకు అంగీకరించడం వంటి నిర్ణయాలు విదేశీ మదుపరులను ఆకట్టుకున్నాయ. జిఎస్‌టి బిల్లుకు తృణమూల్ కాంగ్రెస్, జెడియు వంటి ప్రాంతీయ పార్టీల మద్దతును కేంద్రం కూడగడుతుండటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. సుదీర్ఘకాలం తర్వాత ఎగుమతులు పుంజుకోవడమూ కలిసొచ్చింది. ఫలితంగానే ఈ నెల స్టాక్ మార్కెట్లతోపాటు రుణ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు రాగలిగాయ. నిజానికి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన ఎఫ్‌పిఐలు.. తర్వాతి మూడు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో స్టాక్ మార్కెట్లలో 32,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఎఫ్‌పిఐలు గుమ్మరించారు. వర్ష అంచనాలు, ఆర్‌బిఐ వడ్డీరేట్ల తగ్గింపు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. కాగా, అంతకుముందు రెండు నెలలతో పోల్చితే మే నెలలో వచ్చిన విదేశీ పెట్టుబడులు మాత్రం తక్కువే. 2,543 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే భారత స్టాక్ మార్కెట్లకు వచ్చాయ. ఇక జనవరి, ఫిబ్రవరిలో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకోగా, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఏకంగా 41,661 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. కాగా, ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి- జూన్)లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. మరోవైపు ఈ ఏడాదిలో ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి 27,252 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. అయతే రుణ మార్కెట్ల నుంచి 4,651 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. దీంతో నికర పెట్టుబడుల విలువ 22,601 కోట్ల రూపాయలుగా నమోదైంది.
16 సంస్థల్లోకి 17 వేల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ బ్లూచిప్ సూచీ సెనె్సక్స్ (30)లోని 16 సంస్థల్లోకి 17,465 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు విదేశీ మదుపరులు. ఇదే సమయంలో మిగతా 13 సంస్థల నుంచి 14,389 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకున్నారు. దీంతో జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో సెనె్సక్స్ సంస్థల్లోకి వచ్చిన నికర విదేశీ పెట్టుబడుల విలువ 3,076 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఏప్రిల్-జూన్ వ్యవధిలో అత్యధికంగా డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌లో విదేశీ మదుపరుల వాటా 36 శాతం నుంచి 42.58 శాతానికి పెరిగితే, యాక్సిస్ బ్యాంక్‌లో 42.27 శాతం నుంచి 45.81 శాతానికి చేరింది. అలాగే ఇన్ఫోసిస్, టిసిఎస్, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తదితర సంస్థల్లోనూ విదేశీ మదుపరులు తమ వాటాలను పెంచుకున్నారు. అయతే ఎస్‌బిఐ, బజాజ్ ఆటో, మారుతి సుజుకి, సన్ ఫార్మాసూటికల్స్, కోల్ ఇండియా తదితర సంస్థల్లో పెట్టుబడులను గుంజేసుకున్నారు. మొత్తంగా ఈ ఏప్రిల్-జూన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 14,500 కోట్ల రూపాయలకుపైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయ. అంతకుముందు త్రైమాసికంలో వచ్చినవి 4,495 కోట్ల రూపాయలుగానే నమోదయ్యాయ