జాతీయ వార్తలు
శ్రీనగర్లో కొనసాగతున్న బంద్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 July 2016
శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. పలుచోట్ల హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ను భద్రతాదళాలు కాల్చిచంపినందుకు నిరసనగా సుమారు రెండు వారాలుగా కాశ్మీర్లో ఆందోళనలు జరుగుతున్నాయి. శ్రీనగర్లో 14 రోజులుగా బంద్ కొనసాగుతోంది. వ్యాపార సంస్థలు మూతపడడం, రవాణా వ్యవస్థ స్తంభించడంతో నిత్యావసర సరకుల కోసం ప్రజలు నానా యాతన పడుతున్నారు. అధికధరలకు పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేక సమస్యలతో సతమతమవుతున్నారు.