బిజినెస్

ఏడాదిపాటు ఫ్రీకాలింగ్, ఉచిత 4జి డేటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ వినయోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. గతంలో మార్కెట్లోకి విడుదల చేసిన కాన్వాస్ 2 స్మార్ట్ఫోన్‌ను అద్భుతమైన ఆఫర్లతో గురువారం తిరిగి లాంచ్ చేసింది. ఈ సందర్భంగా వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఏడాది పాటు యూజర్లకు 4జి నెట్‌వర్క్, ఏ నెట్‌వర్క్ ఫోన్లకయినా అపరిమతమైన కాలింగ్ సదుపాయంను ఆఫర్ చేస్తోంది. దీనికోసం ఆ సంస్థ దేశీయ టెలికాం దిగ్గజం భారతీయ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఈ మేరకు కాన్వాస్ 2 పరికరాన్ని ఎయిర్‌టెల్ 4జి సిమ్‌తో మైక్రోమ్యాక్స్ అందిస్తోంది. దేశంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్5 ప్రొటెక్షన్‌తో లభిస్తున్న తొలి ఫోన్ ఇదని చెప్పుకొంటున్న సంస్థ దీని ధరను రూ. 11,999గా నిర్ణయించింది. ఏడాది పాటు స్క్రీన్ రిప్లేస్‌మెంట్, 30 రోజుల స్మార్ట్ఫోన్ రిప్లేస్‌మెంట్ సదుపాయాన్ని కూడా తాము ఆఫర్ చేస్తున్నట్లు మైక్రోమ్యాక్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శుభజిత్ సేన్ గురువారం విలేఖరులకు చెప్పారు.