బిజినెస్
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 August 2017
ముంబయి, ఆగస్టు 22: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్పంగా లాభపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 33 పాయింట్లు పెరిగి 31,291.85 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 11.20 పాయింట్లు అందుకుని 9,765.55 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం ఆరంభంలో సెనె్సక్స్ 218.19 పాయింట్లు, నిఫ్టీ 74.10 పాయింట్లు లాభపడ్డాయి. అయితే మదుపరుల లాభాల స్వీకరణతో సూచీలు ఆరంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. దీంతో స్వల్ప లాభాలకే పరిమితం కావాల్సి వచ్చింది. సోమవారం ట్రేడింగ్లో ఇన్ఫోసిస్ సంక్షోభం దెబ్బకు సూచీలు భారీగానే నష్టపోయినది తెలిసిందే. కాగా, మంగళవారం ట్రేడింగ్లో చమురు, హెల్త్కేర్, పిఎస్యు, బ్యాంకింగ్ రంగాల షేర్ల విలువ పెరిగింది.