బిజినెస్

ఆహారశుద్ధిలో ఏపి ఆదర్శం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: ఆహార ఉత్పత్తిలో అగ్రపథాన ఉన్న భారతదేశం పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కోవడం విచారకరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పెద్దఎత్తున ఉద్యాన పంటలు సాగవుతున్నా తగినంత సంఖ్యలో ఆహారశుద్ధి పరిశ్రమలు లేకపోవడమే దీనికి కారణమని చెప్పారు. ఆహారశుద్ధి రంగంలో ప్రసిద్ధి చెందిన 23 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతో కలిసి ఏపి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ 23 ప్రముఖ సంస్థలు, 110 మంది పెట్టుబడిదారులతో సోమవారం సాయంత్రం ఒప్పందాలు కుదుర్చుకుంది. గత పాలకులు రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినా గడచిన మూడేళ్లుగా అత్యుత్తమ విధానాలను అనుసరించి ఈ రంగంలో ప్రగతి సాధిస్తున్నామని ముఖ్యమంత్రి ఈ సదస్సులో గుర్తుచేశారు. సూక్ష్మపోషకాలు, భూసార పరీక్షలు, సాయిల్ హెల్త్ కార్డులతో రాష్ట్రంలో వ్యవసాయదారులకు ఊతం అందించామని, ఈ రంగంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రోత్సహించేందుకు మిలిందా గేట్స్ ఫౌండేషన్ ముందుకొచ్చిందని చెప్పారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆధునిక సేద్యపు విధానాలు, ప్రపంచంలో అమలులో ఉన్న అత్యుత్తమ పద్ధతులను ప్రవేశపెట్టామని చెప్పారు. ముఖ్యంగా నవీన సాంకేతికతను, యంత్ర పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2కోట్ల ఎకరాల్లో సాగు చేయడమే లక్ష్యంగా తీసుకున్నామన్నారు. ఆహారశుద్ధి పరిశ్రమ రాష్ట్రంలో మరింతగా బలపడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మిలీనియం మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం తగు ప్రయత్నాలు చేస్తోందని ప్రస్తావించారు. దేశంలో ఆహారశుద్ధి రంగానికి ఆంధ్రప్రదేశ్ ఒక ఉత్తమ నమూనాగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ‘్ఫడ్ ప్రాసెసింగ్ సమ్మిట్’ పేరుతో సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రూ.855 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. ఇవి అమల్లోకి వస్తే మొత్తం 9477 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఆహారశుద్ధి ప్రక్రియలో, పంట నష్టాల తగ్గుదల విధానాల అమలులో, నవీన ఆహార పదార్ధాల అభివృద్ధిలో ఈ 23 సంస్థలకు మంచి అనుభవం ఉండటం విశేషం. విశాఖలో జరిగిన గత భాగస్వామ్య సదస్సుల్లో ఆహారశుద్ధి విభాగం మొత్తం 245 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటిలో ఈ ఏడాది 140 యూనిట్లను ఇప్పటికే ఏర్పాటుచేశారు. రూ.1600 కోట్ల విలువైన ఈ పారిశ్రామిక యూనిట్ల స్థాపనతో 25వేల ఉద్యోగావకాశాలు లభించాయి. ఇప్పుడు కుదిరిన ఒప్పందాల ద్వారా రానున్న కాలంలో ఈ రంగంలో అభివృద్ధి ఊపందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.

చిత్రం..ఫుడ్ ప్రాసెసింగ్ సమ్మిట్‌లో మాట్లాడుతున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు