బిజినెస్

మూలధన సేకరణకు వాటాదారుల ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: మార్కెట్ నుంచి రూ. 5వేల కోట్ల మూలధనాన్ని సేకరించడానికి వాటాదారుల ఆమోదం పొందినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) సోమవారం తెలిపింది. అర్హత గల సంస్థలకు వాటాలను అమ్మడం (క్యూఐపీ) ద్వారా కాని రైట్స్ ఇష్యూ ద్వారా కాని ఈ మూలధనాన్ని సేకరించడానికి వాటాదారులు ఆమోదం తెలిపినట్టు పీఎన్‌బీ వెల్లడించింది. పీఎన్‌బీ వాటాదారుల అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) సోమవారం జరిగిందని ఆ బ్యాంకు స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించిన పత్రంలో పేర్కొంది.