బిజినెస్

బ్లాక్‌చైన్ టెక్నాలజీ రాజధానిగా ఏపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 19: రాష్ట్రాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ క్యాపిటల్ ఆఫ్‌ది వరల్డ్‌గా తీర్చడమే తన లక్ష్యమని ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఈ లక్ష్య సాధన కోసమే ప్రభుత్వం కోవలెంట్ ఫండ్‌తో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఈ మేరకు ఒప్పంద అవగాహన జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ కోవలెంట్ ప్రతినిధులను రియల్ టైం గవర్నెన్స్‌కు తీసుకువెళ్లి, దాని పనితీరు వివరించారు.
విశాఖపట్నంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహించామని, బ్లాక్ చైన్ టెక్నాలజీలో యువతీ యువకులు ఉద్యోగాలు సాధించేందుకు హ్యాకథాన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. బ్లాక్ చైన్ టార్గెట్ 2019లో భాగంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ యూనివర్సిటీ ఏర్పాటుకు కోవలెంట్ ఫండ్‌తో ఒప్పందం ప్రయోజనకరమని ఆయన చెప్పారు. 2019లోపు 5వేల మంది విద్యార్థులకు బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేష్ తెలిపారు.
రాష్ట్ర విభజన తరువాత తాము అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, వాటిని అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి టెక్నాలజీని పెద్దఎత్తున వినియోగిస్తున్నామని వారికి వివరించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నామని చెప్పారు. సీఎం కోర్ డ్యాష్ బోర్డ్ ద్వారా రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి తెలుసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ ఒకేచోట సమాచారం అంతా ఉండేలా ఈ ప్రగతి కోర్ ప్లాట్‌ఫార్మ్ రూపొందించినట్లు వివరించారు.ఏపీ ఫైబర్ నెట్ ద్వారా 149 రూపాయలకు టెలివిజన్, వైఫై, టెలిఫోన్ సేవలు అందిస్తున్నాం. టెక్నాలజీని పెద్దఎత్తున వినియోగిస్తున్నాం. దీనివలన సైబర్ ఎటాక్స్ జరిగే ప్రమాదం కూడా ఉంది. అందుకే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వ సమాచారానికి రక్షణ కల్పిస్తున్నామని లోకేష్ వివరించారు. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ రికార్డ్స్ టాంపరింగ్ జరగకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగిస్తున్నామని చెప్పారు. సర్ట్ఫికెట్లు కోసం ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డిజిటల్ లాకర్, ఆధార్ నెంబర్ ద్వారా అన్ని సర్ట్ఫికెట్లు ఆన్‌లైన్‌లో ఇచ్చేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు లోకేష్ వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో సీఈఓ జోసెఫ్ లూబిన్, కాన్‌ఫెన్సిస్, రాం యలమంచిలి, కిషోర్ ఆత్రేయ, వానేసాం, ఐటీ సెక్రటరీ విజయానంద్, ఐటీ సలహాదారు జెఏ చౌదరి, ఈ-ప్రగతి సీఈఓ బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.

చిత్రం..కోవలెంట్ ఫండ్ ప్రతినిధులకు ఆర్టీజీ గురించి వివరిస్తున్న మంత్రి నారా లోకేష్