బిజినెస్

రూ. 7500 కోట్లకు పరుపుల మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: భారతదేశంలో మ్యాట్రెస్ (పరుపులు) మార్కెట్ సైజు రూ.7500కోట్లకు చేరుకుందని సెంచురీ మ్యాట్రెస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలాని తెలిపారు. ప్రపంచ స్లీప్ డే సందర్భంగా శుక్రవారం నాటికి హైదరాబాద్‌లోని సెంచురీ మ్యాట్రస్ సంస్థ ఐదు మిలియన్ల మ్యాట్రెస్ (పరుపులు)ను ఉత్పత్తి చేశామన్నారు.
1988లో తమ సంస్థ కార్యకలాపాలను ఇక్కడ ప్రారంభించామని, తెలంగాణ, ఒరిస్సాలో మూడు ప్లాంట్‌లు ఉన్నాయని చెప్పారు. కాయిర్, ఫోమ్, స్ప్రింగ్, హైబ్రిడ్ రకాల్లో ఐదువేల ఉత్పత్తులు చేశామన్నారు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని తమ ప్లాంట్‌లలో ప్రవేశపెట్టామన్నారు.