బిజినెస్

అయిదు రోజుల నష్టాలకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 20: వరుసగా అయిదు సెషన్ల పాటు పడిపోయిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ మంగళవారం స్వల్పంగా పుంజుకుంది. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ధోరణులు మిశ్రమంగా ఉండటంతో పాటు మదుపరులు ఇటీవలి కాలంలో ధరలు పడిపోయిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ) షేర్లను కొనుగోలు చేయడానికి పూనుకోవడంతో మంగళవారం అనిశ్చితిలో సాగిన బీఎస్‌ఈ సెనె్సక్స్ చివరకు స్వల్పంగా పెరిగింది. ఈ సూచీ సుమారు 74 పాయింట్లు పుంజుకొని, 32,996.76 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి, 10,124.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. ప్రపంచ వాణిజ్య యుద్ధం సంభవిస్తుందేమోననే భయాందోళనల మధ్య మదుపరులు అమెరికా కొత్త ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్స్ తొలి సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలపై దృష్టి సారించారు. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ధోరణి మిశ్రమంగా ఉండటంతో పాటు ఇటీవలి కాలంలో ధరలు పడిపోయిన షేర్లను చేజిక్కించుకోవడానికి మదుపరులు పూనుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు స్వల్పంగా పుంజుకున్నాయని బ్రోకర్లు చెప్పారు. సెనె్సక్స్ సెషన్ ప్రారంభంలో పడిపోయినప్పటికీ, తరువాత ఐటీ, టెలికం షేర్ల ధరలు పెరగడంతో పుంజుకొని, ఇంట్రా- డేలో 33,102.74 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 73.64 పాయింట్ల (0.22 శాతం) లాభంతో 32,996.76 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం అయిదు సెషన్లలో కలిపి 994.82 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ కీలకమైన 10,100 పాయింట్ల స్థాయికి పైన ముగిసింది. ఇంట్రా-డేలో 10,155.65 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన ఈ సూచీ చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 30.10 పాయింట్ల (0.30 శాతం) లాభంతో 10,124.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రా-డేలో ఈ సూచీ 10,049. 10 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకిం ది. ఇదిలా ఉండగా, సోమవారం నాటి లావాదేవీల్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 292.23 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపరులు రూ. 191.52 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
మంగళవారం నాటి లావాదేవీల్లో చాలా ఐటీ కంపెనీల షేర్ల ధరలు పెరిగాయి. విప్రో 1.54 శాతం లాభపడింది. ఇన్ఫోసిస్ 1.30 శాతం లాభపడింది. టీసీఎస్ 1.07 శాతం లాభాన్ని ఆర్జించింది. హెక్సావేర్ టెక్నాలజీస్ 3.75 శాతం, టెక్ మహీంద్ర 3.80 శాతం, పెర్‌సిస్టెంట్ సిస్టమ్స్ 0.85 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.16 శాతం చొప్పున లాభపడ్డాయి. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో టాటా స్టీల్ అత్యధికంగా 3.17 శాతం లాభపడింది. లాభపడిన ఇతర సంస్థల్లో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, అదాని పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఆసియన్ పెయింట్స్, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 2.20 శాతం వరకు పెరిగింది. నష్టపోయిన సంస్థల్లో ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, రిల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ ఉన్నాయి. రంగాల వారీ సూచీలలో బీఎస్‌ఈ ఐటీ సూచీ అత్యధికంగా 1.29 శాతం పుంజుకుంది.