బిజినెస్

తొమ్మిది రోజుల ర్యాలీకి తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 18: వరుసగా తొమ్మిది సెషన్ల పాటు లాభాలు గడించిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో స్వల్పంగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 63 పాయింట్లు దిగజారి 34,331.68 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 22.50 పాయింట్లు పడిపోయి 10,526.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. గత మూడేళ్ల కాలంలో మొదటిసారి ఇటీవల వరుసగా తొమ్మిది రోజుల పాటు స్టాక్ మార్కెట్‌లో ర్యాలీ రావడంతో మదుపరులు బుధవారం లాభాల స్వీకరణకు ఎగబడ్డారు. దీంతో మార్కెట్ కీలక సూచీలు దిగజారాయి. సెనె్సక్స్ బుధవారం ఉదయం 34,443.42 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయి, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు), రిటెయిల్ ఇనె్వస్టర్లు కొనుగోళ్లకు పూనుకోవడంతో మరింత ముందుకు సాగుతూ ఇంట్రా-డేలో 34,591.81 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, సెషన్ ముగిసే సమయంలో మదుపరులు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో సెనె్సక్స్ చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 63.38 పాయింట్లు (0.18 శాతం) దిగజారి, 34,331.68 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం తొమ్మిది సెషన్లలో కలిపి 1,375.99 పాయింట్లు (4.17 శాతం) పుంజుకుంది. అలాగే, నిఫ్టీ కూడా క్రితం ముగింపుతో పోలిస్తే 22.50 పాయింట్లు (0.21 శాతం) దిగజారి 10,526.20 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ ఇంట్రా-డేలో 10,526.20 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 10,509.70 పాయింట్ల కనిష్ట స్థాయి మధ్య కదలాడింది. ఈ సూచీ క్రితం తొమ్మిది సెషన్లలో కలిపి 420.30 పాయింట్లు (4.15 శాతం) పుంజుకున్నది. ఇదిలా ఉండగా, మంగళవారం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 951.39 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 723.81 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
బుధవారం నాటి లావాదేవీల్లో సెనె్సక్స్ ప్యాక్‌లోని యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఎస్‌బీఐ, రిల్, ఆసియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, టీసీఎస్ కంపెనీల షేర్ల విలువ పడిపోయింది. మరోవైపు, ఐటీసీ అత్యధికంగా 2.82 శాతం లాభపడింది. లాభపడిన ఇతర సంస్థల్లో విప్రో, భారతి ఎయిర్‌టెల్, టాటా స్టీల్, అదాని పోర్ట్స్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ ఉన్నాయి.