బిజినెస్

బ్యాంకింగ్ రంగాన్ని గాడిన పెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: కుంభకోణాలు, పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. గురువారం ఆయన ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించారు. బ్యాంకుల్లో జవాబుదారీతనాన్ని పెంచుతామని, బ్యాంకింగ్ రంగానికి దిశ, దశను నిర్దేశించే విధంగా ప్రణాళికను ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ కిడ్నీ మార్పిడి నిమిత్తం ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే. గత వారం పీయూష్ గోయల్‌కు ఆర్థిక శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. తాను జైట్లీని కలిసి చర్చించానని, కొన్ని అంశాలపై స్పష్టత ఇచ్చారని చెప్పారు. బ్యాంకింగ్ రంగం ఆర్థికంగా స్థిరపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో బ్యాంకులు అనేక కంపెనీలకు ఎడాపెడా రుణాలు ఇచ్చాయన్నారు. ఆర్థిక పరిస్థితి మందగించడంతో, రుణ గ్రహీతలు రుణాలు చెల్లించలేకపోయారన్నారు. బ్యాంకుల ఇమేజి దెబ్బతినే విధంగా అనేక స్కాంలు బయటపడుతున్నాయన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలతో బ్యాంకులను సరైన దారిలో నడిపిస్తామని, ఉద్యోగులు, కస్టమర్ల సహకారంతో ఆర్థికాభివృద్ధిని సాధిస్తామన్నారు. ఇష్టం వచ్చినట్లు రుణాలు ఇవ్వడం వల్లనే బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల విలువ పెరిగిందన్నారు. రుణాల రిస్ట్రక్చరింగ్ స్కీంలను అమలు చేయకుండా బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. విద్యుత్, నిర్మాణం, వౌలిక సదుపాయాల రంగాల సంస్థలు పెద్ద ఎత్తున బ్యాంకులకు రుణాలను 2009 సంవత్సరం నుంచి బకాయి పడ్డాయని ఆయన చెప్పారు. బ్యాంకుల ఇమేజిని పెంచే వీటి ఆర్థిక స్థితిని పటిష్టంచేయడమే తమ ముందున్న లక్ష్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.