బిజినెస్

ఆందోళన అక్కరలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో కరెంటు ఖాతా లోటు (సీఏడీ) 2.5 శాతానికి చెందినా ఆందోళన చెందవలసిన అవసరం లేదని, విదేశీ నిధులు తరలిపోవడం వల్ల ఏమయినా అసమతుల్యత ఏర్పడితే, దానిని చక్కదిద్దడానికి అవసరమయిన పరిష్కారం ప్రభుత్వం వద్ద ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. ‘2 శాతం నుంచి 2.5 శాతం వరకు సీఏడీ వల్ల మాకు ఎలాంటి సమస్య ఉండదు. స్థిరత్వం ఉంటే, జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రస్తుత సంవత్సర క్యాపిటల్ అకౌంట్ (ఇన్‌ఫ్లోస్) బాగుండి తీరాలి. అప్పుడు కరెంటు ఖాతా లోటు 2.5 శాతానికి పెరిగినా ఇబ్బంది ఉండదు’ అని గార్గ్ మంగళవారం ఇక్కడ సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. విదేశీ మారకద్రవ్యం రాక, పోకలకు మధ్య గల వ్యత్యాసమే కరెంటు ఖాతా లోటు. ఈ కరెంటు ఖాతా లోటు 2017-18 ఆర్థిక సంవత్సరంలో 48.7 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. అంటే జీడీపీలో 1.9 శాతానికి చేరింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఉన్న దేశ కరెంటు ఖాతా లోటు 14.4 బిలియన్ డాలర్ల (జీడీపీలో 0.6 శాతం)తో పోలిస్తే బాగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ తగ్గిపోవడం, ఫారిన్ పోర్ట్ఫోలియో పెట్టుబడులు తరలిపోవడం వంటి వాటివల్ల కరెంటు ఖాతా లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత పెరుగుతుందేమోననే ఆందోళన నెలకొని ఉంది. ‘నిరుడు 160 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉండింది. 82 బిలియన్ డాలర్ల సేవల మిగులు ఉండింది. విదేశాల నుంచి భారత్‌కు పంపించిన విదేశీ మారకద్రవ్యం 70 బిలియన్ డాలర్లు ఉండింది. అందువల్ల చాలా తక్కువ మొత్తంలోనే కరెంటు ఖాతా లోటు ఉండింది’ అని గార్గ్ వివరించారు. ‘అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగితే, ఈ సమతుల్యత దెబ్బతింటుంది. అప్పుడు క్యాపిటల్ అకౌంట్స్ ఈ అసమతుల్యతను చక్కదిద్దుతుంది’ అని గార్గ్ వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏప్రిల్‌లో ఒక బారెల్‌కు 66 డాలర్లు ఉన్న ముడి చమురు ధర ప్రస్తుతం 74 డాలర్లకు పెరిగింది. ఇది భారత్ కరెంటు ఖాతా లోటు పెరగడానికి కారణమయింది.